AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!!

AP Govt: నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సూరపాటి ప్రశాంత్ కుమార్ (2021 బ్యాచ్)ను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు.

Published : 2024-03-23 07:12:00

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా
మైనార్టీలకు రక్షణ, సంక్షేమం ఒక్క టిడిపితోనే సాధ్యం
2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం
మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు
మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ భరోసా

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళగిరి: మైనార్టీలను మోసం చేసింది జగన్ ప్రభుత్వమేనని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ముస్లీంలపై దాడులు, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల రద్దు, వక్ఫ్ ఆస్తుల కబ్జాలు వైకాపా హయాంలో జరిగాయని లోకేష్ అన్నారు. మంగళగిరి రూరల్ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి డోలాస్ నగర్ లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. మైనార్టీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి ప్రభుత్వం మాత్రమేనని లోకేష్ అన్నారు. రంజాన్ తొఫా, ఇమామ్, మౌజం లకు గౌరవ వేతనం, మసీదుల మరమత్తుల కోసం నిధులు, పెళ్లి కానుక, విదేశీ విద్య, షాదిఖానాల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది టిడిపి ప్రభుత్వం. జగన్ హయాంలో వైసిపి నాయకుల వేధింపులు తట్టుకోలేక ముస్లీం సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబ్దుల్ సలామ్, మిస్బా ఘటనలు లోకేష్ గుర్తు చేశారు. టిడిపి గెలిచిన వెంటనే జగన్ ఆపేసిన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు అన్ని తిరిగి ప్రారంభిస్తాం అని లోకేష్ అన్నారు.

టిడిపి మూడో జాబితా విడుదల!! 11 అసెంబ్లీ 13 ఎంపీలు వీరే!!

మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు: ఇక్కడ రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? 2నెలల క్రితం ఆర్కే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ జగన్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు, అందుకే పార్టీ మారుతున్నాని చెప్పారు. కొండ, కాలువ పోరంబోకు, రైల్వే, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తానని అన్నారు. చేనేతలను ఆదుకుంటానని, మంగళగిరికి ప్రతి ఏడాది 2వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ప్రత్యేక నిధులు, ఇళ్ల పట్టాలు ఏమయ్యాయి? ప్యాకేజి కుదిరాక మళ్లీ వైసిపిలో చేరి జగనంతటోడు లేడంటున్నాడు. అందుకే ఆయనకు కరకట్ట కమలహాసన్ అని పేరుపెట్టా. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులకు మొదట ఓటేసింది ఆర్కేనే. ఆయన మాటలు నమ్మి మంగళగిరి ప్రజలు మరోసారి మోసపోవద్దు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తా: 2014లో అమరావతి రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం ఇష్టంలేదని, రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలని, అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాని జగన్ చెప్పారు. గత ఎన్నికల్లో విజయం సాధించాక మాటతప్పి మడమతిప్పి 3రాజధానుల నాటకానికి తెరలేపారు. అమరావతి పూర్తై ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు, మహిళలను వేధించారు. శాసనమండలిలో కూడా ఆనాడు మా గొంతు నొక్కారు. రెండునెలల్లో అమరావతిలో ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం. ఆగిపోయిన రాజధాని నిర్మాణపనులను పూర్తిచేసి తీరుతాం. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు న్యాయంచేస్తాం.

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా: 2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. అప్పుడు మీ సమస్యలు నాకు తెలియవు, నా గురించి మీకు తెలియదు. అయినా బేతపూడిలో నాకు మెజార్టీ ఇచ్చారు. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం. కాలువ, కొండ పోరంబోకు, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తాం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. జగన్ రెడ్డి కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్. పది రూపాయలు అకౌంట్ లో వేసి, రెడ్ బటన్ తో వంద లాగేసుకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, చంద్రన్నబీమా, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి వంద పథకాలను కట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన కరెంట్ ఛార్జీలు, పన్నుల భారం తగ్గిస్తాం.

సంప్రదాయ చీరకట్టుతో "శారీ రన్"!! ఆనందంతో మహిళల కేరింతలు!!సందడి చేసిన నారా బ్రహ్మణి

కళ్యాణమండపం, షాదీఖానా నిర్మిస్తాం: బేతపూడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తెస్తూ... వర్షాకాలంలో గ్రామంలోని శివాలయం గర్భగుడిలోకి వర్షపునీరు వస్తోంది. హిందూ, క్రిష్టియన్ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలి. చెరువుకట్టపై నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కల్యాణ మండపాన్ని నిర్మించాలని కోరారు. నవులూరు ప్రజలు సమస్యలను చెబుతూ... డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్ల సమస్యను పరిష్కరించాలి. మైనారిటీలకు షాదీఖానా నిర్మించాలి. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్మశాన వాటిక అభివృద్ధి చేయడంతో పాటుప్రహరీగోడ ఏర్పాటుచేయాలని కోరారు. మైనార్టీల కోసం షాదీఖానా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చా బేతపూడిలో కళ్యాణమండపం, నవులూరులో షాదీఖానా నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి. మంగళగిరిలో లోకేష్ ను లక్ష మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని అన్నారు.

ఇవి కూడా చదవండి: 

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం!! పలు కీలక సూచనలు, నియమాలు! పాటించకుంటే చర్యలే

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

Evolve Venture Capital  

నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →