ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు, ఆర్యవైశ్య, క్షత్రియ, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కూటమి మేనిఫెస్టో కొన్ని హామీలను ప్రకటించింది.
కాపుల సంక్షేమం కోసం:
కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం అని తెలిపారు. అంతేకాకుండా కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం అన్నారు.
ఇంకా చదవండి: మహిళలకు రైతులకు కూటమి మేనిఫెస్టోలో పెద్దపీట! ఉచిత విద్యుత్ సరఫరా! పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!
ఆర్యవైశ్య సంక్షేమం కోసం :
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేరకు నిధులు కేటాయింపు
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం
స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు
కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం
క్షత్రియ సంక్షేమం కోసం:
భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం
ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు
అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం:
కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారిత, అభివృద్ధికి చర్యలు చేపడతాం అని ప్రకటించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: