tdp new Committee: రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు... 59 నియోజకవర్గాలకు కొత్త కార్యదర్శుల నియామకం! Cylinder Explosion: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం... సిలిండర్ పేలుడుపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! tdp new Committee: నియోజకవర్గాల వారీగా కొత్త నియామకాలు... జోనల్ కో-ఆర్డినేటర్స్ గా ఆ 10 మందికి....!! tdp new Committee: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! tdp new Committee: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల! AP govt: టీడీపీ జాతీయ గళం.. ఈ 10 మంది.. వాగ్ధాటి గల నేతలకు అధికార ప్రతినిధులుగా పట్టం! tdp new Committee: కీలక కమిటీల ప్రకటన... నాలెడ్జ్ కమిటీ,స్టేట్ హెచ్ఆర్డీ అండ్ మీడియా బాధ్యతల్లో కొత్త సారథులు! AP Govt: కేడర్‌కు భరోసా.. యువతకు మార్గదర్శనం.. 18 మంది ఉపాధ్యక్షులకు కీలక బాధ్యతలు.. tdp new Committee: రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు... 59 నియోజకవర్గాలకు కొత్త కార్యదర్శుల నియామకం! Cylinder Explosion: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం... సిలిండర్ పేలుడుపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! tdp new Committee: నియోజకవర్గాల వారీగా కొత్త నియామకాలు... జోనల్ కో-ఆర్డినేటర్స్ గా ఆ 10 మందికి....!! tdp new Committee: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! tdp new Committee: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల! AP govt: టీడీపీ జాతీయ గళం.. ఈ 10 మంది.. వాగ్ధాటి గల నేతలకు అధికార ప్రతినిధులుగా పట్టం! tdp new Committee: కీలక కమిటీల ప్రకటన... నాలెడ్జ్ కమిటీ,స్టేట్ హెచ్ఆర్డీ అండ్ మీడియా బాధ్యతల్లో కొత్త సారథులు! AP Govt: కేడర్‌కు భరోసా.. యువతకు మార్గదర్శనం.. 18 మంది ఉపాధ్యక్షులకు కీలక బాధ్యతలు..

Jagan: అందరి ముందు పరువు పోయింది గా.. జగన్ పర్యటనకు వెళ్తే లక్ష రూపాయల ఫైన్.. తీర ప్రాంతంలో ఉద్రిక్తత..

Jagan: నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని తీర్మానించారు. నిబంధన ఉల్లంఘించి వెళ్లిన వారికి ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

Published : 2026-04-15 12:29:00
  • నెల్లూరు తీరంలో 'లక్ష' పెనాల్టీ వార్: జగన్ రాకను అడ్డుకుంటున్న స్థానిక పరిస్థితులు..
     
  • Politics: "లక్ష రూపాయల జరిమానా తప్పదు": మత్స్యకార సంఘాల కఠిన నిబంధనతో కలకలం..

Jagan: నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతతో కూడిన రాజకీయ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో, స్థానిక మత్స్యకారులు ఆయన పర్యటనను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకార సంఘాలు సమావేశమై, జగన్ పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించి పర్యటనకు హాజరైతే, వారికి ఏకంగా లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార పెద్దలు హెచ్చరించారు. ఈ నిర్ణయం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి నాలుగు బోట్లు రహస్యంగా అదృశ్యం కావడమే. గతంలో తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు మన తీర ప్రాంతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని హార్బర్‌లో భద్రపరిచారు. అయితే, ఇటీవల ఆ బోట్లు మాయం కావడంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బోట్ల అదృశ్యం వెనుక తెలుగుదేశం పార్టీ ఎంపీ బీదా మస్తాన్ రావు మరియు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బీదా రవిచంద్ర హస్తం ఉందని మత్స్యకారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరించారని మత్స్యకారులు ఆగ్రహంతో ఉన్నారు.

బోట్ల వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న మత్స్యకారులు, ఇప్పటికే బీదా సోదరులపై 'దురాయి' (సామాజిక బహిష్కరణ) విధించారు. వారితో మాట్లాడినా లేదా సంబంధాలు పెట్టుకున్నా లక్ష రూపాయల జరిమానా చెల్లించాలనే కఠిన నిబంధనను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నిరసన సెగ జగన్ పర్యటనకు కూడా తాకింది. బోట్ల అదృశ్యంపై స్పష్టత వచ్చే వరకు మరియు తమకు న్యాయం జరిగే వరకు వైసీపీ, టీడీపీతో సహా ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలను కలవకూడదని, వారి సభలకు వెళ్లకూడదని మత్స్యకారులు భీష్మించుకూర్చున్నారు. ఈ పరిణామాలు నెల్లూరు తీర ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి.

Spotlight

Read More →