- చరిత్ర సృష్టించిన మలుపు.. రైలు ప్రయాణంలో వింత అనుభవం..
- ఆ రోజు బ్రిటిష్ వారు ఆ వంపు తిప్పకపోయి ఉంటే…
మన ఆంధ్రప్రదేశ్లో చారిత్రక నగరమైన రాజమండ్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం గోదావరి నది మాత్రమే కాదు, మన రైల్వే ప్రయాణాల్లో కూడా రాజమండ్రికి ఒక గొప్ప విశేషం దాగి ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడియం దగ్గర ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే కర్వ్ మీకు తెలుసా? ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద రైల్వే కర్వ్ (వంపు) రాజమండ్రికి చాలా దగ్గరలో ఉంది. రాజమండ్రికి సమీపంలోని కడియం దగ్గర ఈ భారీ వంపును మనం చూడవచ్చు. సాధారణంగా రైల్వే అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రజల నమ్మకం ప్రకారం కేరళలోని కొల్లాం దగ్గర మొదటి అతిపెద్ద కర్వ్ ఉండగా, మన కడియం దగ్గర ఉన్నది రెండో అతిపెద్ద కర్వ్ అని చెబుతుంటారు.
రైల్వే లైన్లలో వంపులు ఎందుకు ఉండవు? సాధారణంగా రైల్వే లైన్లను నిర్మించేటప్పుడు ఇంజనీర్లు వీలైనంత వరకు స్ట్రెయిట్ లైన్ (నేరుగా) ఉండాలని కోరుకుంటారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
• వేగం: రైల్వే లైన్లో వంపులు ఉంటే, ఆ ప్రాంతంలో రైళ్లు వెళ్లేటప్పుడు వేగాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంటుంది.
• ఖర్చు: స్ట్రెయిట్ లైన్లతో పోలిస్తే, వంపులతో కూడిన రైల్వే లైన్లను డిజైన్ చేయడం కష్టంతో కూడుకున్న పని మరియు దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది.
బ్రిటిష్ వారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లే దారిలో ఉన్న ఈ రైల్వే లైన్ నిర్మాణ సమయంలో ఒక ఆసక్తికరమైన నిర్ణయం జరిగింది. ఈ రైల్వే లైన్ను మొదట బ్రిటిష్ వారు నిర్మించారు. ఒకవేళ వారు కడియం నుండి నిడదవోలుకు నేరుగా (స్ట్రెయిట్ లైన్) రైల్వే లైన్ నిర్మించి ఉంటే, రాజమండ్రి నగరం రైల్వే మ్యాప్లో ఉండేది కాదు,. కానీ వారు రాజమండ్రి నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ నగరం యొక్క విశిష్టతను గుర్తించారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్ ఏర్పాటు రాజమండ్రి ప్రాముఖ్యతను గుర్తించిన బ్రిటిష్ వారు, కడియం దగ్గర ఆ రైల్వే లైన్ను భారీ వంపు తిప్పి రాజమండ్రి నగరం మీదుగా తీసుకువచ్చారు. ఇలా వంపు తిప్పడం వల్ల మనకు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఏర్పడింది,. దీనివల్ల రాజమండ్రి నగరం మెయిన్ లైన్లోకి రావడమే కాకుండా, లక్షలాది మంది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఒకవేళ అప్పుడు ఆ వంపు తిప్పకపోయి ఉంటే, మనకు రాజమండ్రి రోడ్ స్టేషన్ మాత్రమే ఉండేది లేదా అసలు స్టేషనే ఉండేది కాదు.
మీ తదుపరి ప్రయాణంలో గమనించండి.. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం నుండి రాజమండ్రి వైపు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, కడియం స్టేషన్ దాటాక ఈ భారీ వంపును అబ్సర్వ్ చేయండి. కేవలం ఒక నగరం యొక్క ప్రాముఖ్యత కోసం ఇంజనీరింగ్ సవాళ్లను దాటుకుని నిర్మించిన ఈ రైల్వే కర్వ్ నిజంగా ఒక అద్భుతం. ఈసారి ప్రయాణంలో కిటికీలోంచి ఈ వంపును చూస్తూ, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను గుర్తు చేసుకుంటే ఆ ప్రయాణం మరింత ఆనందంగా ఉంటుంది.