Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్!

New Flyover: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ - హయత్‌ నగర్ మధ్య 941 కోట్లతో 5.5 కి.మీ పొడవునా నాగ్‌పూర్ తరహా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో సర్వీస్ రోడ్లు, నేషనల్ హైవే మరియు మెట్రో ఒకే మార్గంలో వేర్వేరు అంచెల్లో ఉండటం విశేషం.

Published : 2026-03-25 17:01:00

భాగ్యనగరానికి డబుల్ డెక్కర్ కానుక: ఎల్బీ నగర్ టు హయత్‌ నగర్ ఇక 'ఫ్లై'అవడమే!

నాగ్‌పూర్ తరహాలో మూడు అంచెల వంతెన.. మధ్యలో హైవే, పైన మెట్రో!

ఎల్బీ నగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఆరు నెలల్లోనే ఫ్లైఓవర్ పనులు ప్రారంభం…

NewFlyover: హైదరాబాద్ నగర తూర్పు ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ఎల్బీ నగర్ నుంచి హయత్‌ నగర్ వరకు నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు 941 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును నాగ్‌పూర్ తరహాలో మూడు అంచెలుగా నిర్మించనున్నారు. కింది భాగంలో సర్వీస్ రోడ్లు, మధ్యలో జాతీయ రహదారి, పైన మెట్రో రైలు వెళ్లేలా ఈ అద్భుత కట్టడాన్ని రూపొందించారు. దీనివల్ల ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఫ్లైఓవర్ మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఎల్బీ నగర్, హయత్‌ నగర్ మధ్య దాదాపు 65కు పైగా కాలనీలు ఉండగా, సుమారు 12 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. సరైన క్రాసింగ్ పాయింట్లు లేకపోవడంతో స్థానికులు అదనంగా 2.2 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ డబుల్ డెక్కర్ నిర్మాణం పూర్తయితే స్థానికులకు కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగే పని తప్పుతుంది. అలాగే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి, కేవలం రెండున్నర గంటల్లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం కలుగుతుంది.

ప్రాజెక్టు అంచనా వ్యయం 941 కోట్ల రూపాయలు కాగా, ఇందులో సింహభాగం అంటే 741 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. మిగిలిన 200 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నెల రోజుల్లో అవసరమైన అన్ని అనుమతులు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

పనుల వేగం పెంచేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. వచ్చే ఆరు నెలల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు ఇప్పటికే ఆరు లేన్ల విస్తరణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

కేవలం ఎల్బీ నగర్ ప్రాంతమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మట్టి రోడ్లు లేకుండా అన్నింటినీ బీటీ రోడ్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో 13 వేల కోట్లతో 6092 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారి అభివృద్ధిలో భాగంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తెలంగాణ రోడ్డు నెట్‌వర్క్ అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Spotlight

Read More →