Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..?

Belgium: బెల్జియంలో వర్క్ పర్మిట్ ప్రక్రియ పూర్తి డిజిటల్.. 2026 మే నుండి..

Belgium: యూరప్ దేశమైన బెల్జియం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. 2026 మే 1 నుంచి షార్ట్‌టర్మ్ వర్క్ పర్మిట్, కమ్యూటర్ పర్మిట్ దరఖాస్తులన్నింటినీ పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Published : 2026-04-21 11:37:00

విదేశీ ఉద్యోగుల అనుమతుల ప్రక్రియలో భారీ మార్పులు..

ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ అధికారిక ప్రకటన..

యూరప్ దేశమైన బెల్జియం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. 2026 మే 1 నుంచి షార్ట్‌టర్మ్ వర్క్ పర్మిట్, కమ్యూటర్ పర్మిట్ దరఖాస్తులన్నింటినీ పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఏప్రిల్ 17, 2026న ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు కొనసాగుతున్న ఈమెయిల్ విధానాన్ని పూర్తిగా నిలిపివేసి, ఇకపై అన్ని దరఖాస్తులు ప్రభుత్వ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ లేదా వారి ప్రతినిధులు తప్పనిసరిగా ఈ కొత్త విధానాన్ని అనుసరించాలి.

ఈ మార్పు ప్రధానంగా యూరప్ యూనియన్‌కు చెందని (నాన్-ఈయూ) నిపుణుల కోసం ఇచ్చే తాత్కాలిక వర్క్ పర్మిట్లపై ప్రభావం చూపనుంది. సాధారణంగా 90 రోజుల వరకు ఉండే ఈ పర్మిట్లు టెక్నికల్ సపోర్ట్, వ్యాపార సమావేశాలు, శిక్షణ, పరికరాల ఇన్‌స్టాలేషన్ వంటి పనుల కోసం జారీ చేస్తారు.

ఈ డిజిటల్ మార్పుతో పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తుల్లో పూర్తి సమాచారం లేకపోవడం, అన్నీ డాక్యుమెంట్ లు, ఫైళ్లు లేకపోవడం  వల్ల ఆలస్యాలు ఏర్పడేవి. కొత్త ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా దరఖాస్తులను సులభంగా ట్రాక్ చేయడం, డాక్యుమెంట్లను త్వరగా పరిశీలించడం, మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు.

అయితే, కొత్త విధానం అమల్లోకి రావడానికి ముందు ఎంప్లాయర్ లు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకుని, డిజిటల్ క్రెడెన్షియల్స్ పొందాలి. ముందుగానే నమోదు చేయకపోతే దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రత్యేకంగా వాలోనియా ప్రాంతం లో తాత్కాలిక సడలింపు కల్పించారు. అక్కడ ఆగస్టు 31, 2026 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ ఫ్లాండర్స్ మరియు బ్రస్సెల్స్ క్యాపిటల్ రీజన్ ప్రాంతాల్లో మే 1 నుంచే పూర్తిగా ఆన్‌లైన్ విధానం తప్పనిసరి కానుంది.

ఈ సంస్కరణ బెల్జియం ప్రభుత్వం చేపడుతున్న విస్తృత డిజిటల్ మార్పులలో భాగం. యూరప్ దేశాల్లో ప్రజా సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ప్రయత్నాలకు ఇది అనుగుణంగా ఉంది. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపే విధానానికి పూర్తిగా ముగింపు పలుకుతూ, బెల్జియం వర్క్ పర్మిట్ వ్యవస్థలో ఇది ఒక కీలకమైన మార్పుగా నిలవనుంది.

Spotlight

Read More →