LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Immigration: విదేశీయుల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు విడుదల చేసిన కేంద్రం! Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు! USA UPdates: భారత టెక్ నిపుణులకు ఎన్విడియా బంపర్ ఆఫర్.. సిలికాన్ వ్యాలీ లేఆఫ్స్ వేళ భారీ జీతాలతో రిక్రూట్మెంట్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Gun Shooting: అమెరికాలో కాల్పుల కలకలం... ఏడుగురు మృతి! Rains: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఐఎమ్‌డీ అలర్ట్! Sweetest Mango: టెంక చాలా పల్చగా.. రసం చాలా ఎక్కువగా.. ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఇదే.! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Immigration: విదేశీయుల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు విడుదల చేసిన కేంద్రం! Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు! USA UPdates: భారత టెక్ నిపుణులకు ఎన్విడియా బంపర్ ఆఫర్.. సిలికాన్ వ్యాలీ లేఆఫ్స్ వేళ భారీ జీతాలతో రిక్రూట్మెంట్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Gun Shooting: అమెరికాలో కాల్పుల కలకలం... ఏడుగురు మృతి! Rains: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఐఎమ్‌డీ అలర్ట్! Sweetest Mango: టెంక చాలా పల్చగా.. రసం చాలా ఎక్కువగా.. ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఇదే.! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్!

Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు!

Mahanadu: మాల్టాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడాయి. MALTA NRI TDP ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 2026-06-02 14:09:00

మాల్టాలో ఆవిష్కృతమైన అన్న ఎన్టీఆర్ విగ్రహం..

ప్రవాస తెలుగువారితో సందడిగా మాల్టా మహానాడు..

మాల్టాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడాయి. మాల్టా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా మాల్టాలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో శ్రమించి విగ్రహాన్ని మాల్టాకు తీసుకువచ్చిన విగ్రహ దాత శ్రీమతి ముళ్ళపూడి లతా మురళి గారికి సభ వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో పాల్గొన్న అభిమానులు ఎన్టీఆర్ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణాన్ని మార్మోగించారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన మహానాడులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాల్టాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు. ఆయన రాజకీయాల్లోనూ, సినీరంగంలోనూ సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నా తెలుగు తల్లిపై ప్రేమను నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మురళి ముళ్ళపూడి, లతా ముళ్ళపూడి, రవి సాగి, అజార్ షేక్, నరేష్ తాళ్లపనేని, సతీష్ ముళ్ళపూడి, చాగంటి బ్రహ్మ, సుమంత్ పద్మాల, గౌరవ్ జోషి, సురేష్ విశ్వనాథ్, అబ్బూరి ప్రశాంత్, కైపు లక్ష్మి, సంపత్, పి.వేణుగోపాల్, చావా శ్రీనాథ్, కె.రణధీర్, మల్లికార్జున్, వెంకట్ యామిని, రాజీవ్, వికాస్, సతీష్ దుర్గం, వినోద్, ప్రదీప్, సుధీర్ రెడ్డి, వంశీ, గోపీ తదితరులు పాల్గొన్నారు.

మొత్తానికి మాల్టాలో జరిగిన ఈ మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని, తెలుగు సంస్కృతిపై ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Spotlight

Read More →