Celebrity Couples: బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఆమె వెనుకాడదు. గత కొంతకాలంగా జాన్వీ కపూర్, శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఈ జంట జంటగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని జాన్వీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది.
శిఖర్తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. అతని దగ్గర తాను చాలా ప్రశాంతంగా, చిన్నపిల్లలా ఉంటానని జాన్వీ చెప్పుకొచ్చింది. "ప్రేమ అనేది మనల్ని మనం సరికొత్తగా చూసుకునేలా చేస్తుంది. శిఖర్ దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా భద్రతగా అనిపిస్తుంది. నా ఆలోచనలను పంచుకోవడానికి, ఒక చిన్న పాపలా అల్లరి చేయడానికి అతను నాకు ఇచ్చే వెసులుబాటు మరెక్కడా దొరకదు. నిజం చెప్పాలంటే అతనితో గడిపే సమయమే నాకు అత్యంత సంతోషకరమైనది అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
శిఖర్ పహారియా కేవలం జాన్వీకే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా చాలా సన్నిహితుడని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు కూడా జాన్వీ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్లతో కూడా శిఖర్ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఎటువంటి స్వార్థం లేకుండా తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని ఆమె ప్రశంసించింది. ఒక మనిషి మరొకరి కోసం అంత నిస్వార్థంగా ఉండటం చాలా అరుదని, శిఖర్ ప్రవర్తన తనకు ఎంతో నచ్చిందని ఆమె పేర్కొంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె టైగర్ ష్రాఫ్ సరసన 'లగ్ జా గలే' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తోంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా, ఆమె నటించిన 'హోమ్ బౌండ్' సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడం జాన్వీ కెరీర్లోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. పెద్ది సినిమాలో కూడా త్వరలో విడుదల కానుంది తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, కమర్షియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఆమె చూస్తోంది.
సినిమాలతో, ఇటు వ్యక్తిగత విషయాలతో జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. శిఖర్ పహారియాతో తన ప్రేమ వ్యవహారంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.