CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...!

Summer School Updates: విద్యార్థులకు అలర్ట్.. మార్చి 16 నుంచి స్కూళ్ల సమయం మార్పు.. విద్యాశాఖ కీలక ప్రకటన.!!

Summer Schools Timings: తెలంగాణలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల కొత్త టైమింగ్స్, మధ్యాహ్న భోజనం వేసవి సెలవుల వివరాలు..

Published : 2026-03-12 09:11:00

తెలంగాణలో భానుడు ఇప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఫిబ్రవరి నుంచే మొదలైన ఎండలు మార్చి వచ్చేసరికి మరింత ముదిరాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే చిన్న పిల్లలు ఈ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఖచ్చితంగా ఒంటిపూట బడుల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్కూళ్లు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా విద్యార్థులందరూ ఇంటికి చేరుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మధ్యాహ్నం 12:30 గంటలకు యధావిధిగా మధ్యాహ్న భోజనం వడ్డించి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు. ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని, అదనపు తరగతుల పేరుతో పిల్లలను ఎండలో ఉంచకూడదని విద్యాశాఖ హెచ్చరించింది.

ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్నందున, ఉర్దూ మీడియం పాఠశాలలకు గతంలోనే కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అయితే మార్చి 15 వరకు మాత్రమే ఆ ప్రత్యేక సమయాలు అమల్లో ఉంటాయి. 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలు (తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం) ఒకే సమయానికి అంటే మధ్యాహ్నం 12:30 గంటలకే ముగియనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని, స్కూళ్లలో తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ విద్యా సంవత్సరం ముగింపు  సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీని చివరి పని దినంగా నిర్ణయించారు. అంటే ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా వేసవి విరామం తర్వాత, తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఈ లోపు సిలబస్‌ను పూర్తి చేసి, వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయట తిరగనివ్వకూడదని వైద్యులు కూడా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు చల్లని పానీయాలు, పండ్లు ఇచ్చి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదరక ముందే బడుల సమయం తగ్గించడం వల్ల పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

Spotlight

Read More →