కుటుంబసభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించనున్న యువనేత లోకేష్
మంగళగిరి: యువనేత నారా లోకేష్ ఆదివారం (7-1-2024) మంగళగిరిలోని వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం 10గంటలకు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసి, కిరీటం అలంకరణ, చెంచులక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం తీసుకుంటారు. అనంతరం మంగళగిరిలోని శివాలయాన్ని సందర్శించి పార్వతీపరమేశ్వరులకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. తర్వాత పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరగా స్వయంభువు రాజ్యలక్ష్మి అమ్మవారికి హారం, పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి