Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు OTT UPdate: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా.. బాక్సీఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు! Bhagyashree: పాల సరస్సులో తెల్లకలువలాంటి భాగ్యశ్రీ బోర్సే.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న అందాల శిల్పం! Ram Charan: 'పెద్ది' చిత్రానికి మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్: ఆన్‌లైన్ పైరసీపై ముందస్తు నిషేధ ఉత్తర్వులు! Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు OTT UPdate: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా.. బాక్సీఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు! Bhagyashree: పాల సరస్సులో తెల్లకలువలాంటి భాగ్యశ్రీ బోర్సే.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న అందాల శిల్పం! Ram Charan: 'పెద్ది' చిత్రానికి మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్: ఆన్‌లైన్ పైరసీపై ముందస్తు నిషేధ ఉత్తర్వులు! Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ!

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Published : 2026-05-29 12:35:00
  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు…
     
  • Cinema: టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం, రాబోయే జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందానికి, పంపిణీదారులకు (డిస్ట్రిబ్యూటర్లకు) భారీ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి, అలాగే ప్రత్యేక ప్రదర్శనలు (స్పెషల్ షోలు) నిర్వహించుకోవడానికి అధికారికంగా అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం, జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. అంతకంటే ఒకరోజు ముందే, అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'పెద్ది' స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను జీఎస్‌టీ (GST) శ్లాబులతో కలిపి గరిష్ఠంగా రూ. 600గా ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని భారీ పాన్ ఇండియా చిత్రాల ప్రీమియర్ షోల టికెట్ ధరలు బ్లాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లలోనే వెయ్యి రూపాయలకు పైగా పలికిన తరుణంలో, 'పెద్ది' చిత్రానికి గరిష్ఠ పరిమితిని రూ. 600గా నిర్ణయించడంపై అటు మెగా అభిమానులు, ఇటు సామాన్య సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు, సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు (జూన్ 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు) థియేటర్లలో టికెట్ల ధరలను అదనంగా పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై రూ. 100, మరియు మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా వసూలు చేసుకునేందుకు పంపిణీదారులకు అనుమతినిచ్చింది. ఈ ధరల పెంపుతో పాటు, అదే తొలి వారం రోజులలో థియేటర్లలో రోజుకు ఐదు ఆటలు (5 షోలు) ప్రదర్శించుకోవడానికి కూడా యంత్రాంగం అనుమతించింది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఐదు భాషల్లో అత్యంత భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా సానుకూల నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' సినిమాకు తొలి వారంలోనే రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Spotlight

Read More →