ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న భారతదేశపు డిజిటల్ చెల్లింపులు..
జర్మనీకి చెందిన పర్యాటకుడు వ్యాఖ్యలు..
భారత్లో డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జర్మనీకి చెందిన పర్యాటకుడు ఫిలిప్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వైరల్ అయింది.
ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఫిలిప్, భారతదేశంలో QR కోడ్ ఆధారిత చెల్లింపుల విధానం ఎంత సులభంగా, వేగంగా పనిచేస్తుందో వివరించాడు. “ఇక్కడ డబ్బులు చెల్లించడం చాలా ఈజీ… QR కోడ్ స్కాన్ చేస్తే చాలు” అని అతను తెలిపాడు.
అతను చెప్పినట్టు, ఈ సౌకర్యం కేవలం పెద్ద షాపుల్లోనే కాకుండా, దేవాలయాలు, మార్కెట్లు, టాక్సీలు వంటి ప్రతిచోటా అందుబాటులో ఉండటం భారత్ ప్రత్యేకతగా నిలుస్తోంది. దీంతో సాధారణ ప్రజలకే కాదు, విదేశీ పర్యాటకులకు కూడా లావాదేవీలు ఎంతో సులభంగా మారాయి.
పోస్ట్ క్యాప్షన్లో ఫిలిప్ “రియల్ డిజి-ఇండియా” అంటూ ప్రశంసలు కురిపించాడు. నగదు లేదా కార్డులు అవసరం లేకుండా, మొబైల్ ఫోన్తోనే ఎక్కడైనా చెల్లింపులు చేయగలగడం ఎంతో సౌకర్యంగా ఉందని పేర్కొన్నాడు.
ఫిలిప్ అనుభవం చూస్తే, భారత్లో డిజిటల్ చెల్లింపులు ఎంత విస్తృతంగా ప్రజల జీవితంలో భాగమయ్యాయో స్పష్టమవుతోంది. రోజువారీ లావాదేవీలను సులభం, వేగవంతం చేస్తూ, దేశాన్ని క్యాష్లెస్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తానికి, స్థానికులకే కాదు విదేశీయులకు కూడా అనుకూలంగా మారిన ఈ వ్యవస్థ, భారత్ను డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడుతోంది.