ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. పేలవమైన సేల్స్, సర్వీసింగ్పై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కొలువుల కోతకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 500 మందిపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. లాభాల మార్జిన్, లాభదాయకతను మెరుగుపరచడం కోసం పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు చర్యలు అవసరమని కంపెనీ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా, ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు సామాజిక మాధ్యమం ఎక్స్లో కమెడియన్ కునాల్ కమ్రా, భవీశ్ అగర్వాల్ మధ్య వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: