Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!

Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

2025-11-06 12:55:00
AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ 10న జరగబోయే కేబినెట్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు తుది ముద్ర పడే అవకాశం ఉంది. జిల్లాల సరిహద్దుల మార్పులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, ప్రజల అభ్యర్థనలు మొదలైన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

మంత్రివర్గ ఉపసంఘం సుమారు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి, ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యసాధ్యాలను సమీక్షించింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి చేర్చే ప్రతిపాదనకు సానుకూలత తెలిపింది. అదే విధంగా, తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలనే అభ్యర్థనను కూడా సానుకూలంగా పరిశీలించింది. గన్నవరం నియోజకవర్గ భవిష్యత్తుపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, రెండ్రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..!

ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ, కొత్తగా మరో ఆరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర, నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లను చేర్చే అవకాశం ఉందని సమాచారం. జిల్లాల పునర్విభజనలో ప్రాంతీయ సమతౌల్యం, ప్రజల సౌకర్యం, పరిపాలనా సామర్థ్యం ప్రధాన ప్రమాణాలుగా ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ పునర్విభజన ద్వారా ప్రతి పౌరుడు జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకునేలా దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.

NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో!

జనగణన ప్రకారం డిసెంబర్‌ 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆగస్టు 13న జరిగిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలోనే ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి నేరుగా అభ్యర్థనలు స్వీకరించారు. మొత్తంగా దాదాపు 200 వరకు అర్జీలు అందగా, వాటిపై విస్తృతంగా చర్చించి నివేదికను సిద్ధం చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ పునర్విభజనతో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడి పరిపాలనా వ్యవస్థ మరింత సజావుగా మారనుంది.

AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!
Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి!
Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!
భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!
Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

Spotlight

Read More →