Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! India vs Pakistan: మాకు నష్టమే ఎక్కువ.. పాక్ నిర్ణయంపై పెదవి విరుస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.!! India pakistan: T20 WC మ్యాచ్ రద్దయితే పాక్‌పై చట్టపరమైన చర్యలు.. ICC హెచ్చరిక! Cricket News Telugu: హిట్‌మ్యాన్‌కు దక్కిన గౌరవం.. భారత ప్రభుత్వానికి రోహిత్ కృతజ్ఞతలు. హెచ్‌సీఏలో కీలక మలుపు..! అధ్యక్షుడిగా ఆయన నియామకం! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! India vs Pakistan: మాకు నష్టమే ఎక్కువ.. పాక్ నిర్ణయంపై పెదవి విరుస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.!! India pakistan: T20 WC మ్యాచ్ రద్దయితే పాక్‌పై చట్టపరమైన చర్యలు.. ICC హెచ్చరిక! Cricket News Telugu: హిట్‌మ్యాన్‌కు దక్కిన గౌరవం.. భారత ప్రభుత్వానికి రోహిత్ కృతజ్ఞతలు. హెచ్‌సీఏలో కీలక మలుపు..! అధ్యక్షుడిగా ఆయన నియామకం!

IND vs AUS Womens T20: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ కైవసం !

IND vs AUS Womens T20: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మహిళలు 2-1తో ద్వైపాక్షిక సిరీస్ గెలిచారు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి కీలకంగా రాణించారు.

Published : 2026-02-21 21:25:00
  • స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలు..
     
  • ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్ గెలిచిన భారత్..

IND vs AUS Womens T20: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో కంగారూలను ఓడించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధన (55 బంతుల్లో 82), జెమిమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59) అద్భుత అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశారు. ఇది అడిలైడ్ ఓవల్‌లో మహిళల టీ20ల్లో అత్యధిక స్కోరు కావడం విశేషం.

177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. ఆష్లీ గార్డ్‌నర్ (57) ఒంటరి పోరాటం చేసినా, ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్లు శ్రేయంక పాటిల్ (3/22), శ్రీ చరణి (3/32) తమ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టి, 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులకే కట్టడి చేశారు.

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు 2016 తర్వాత ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. మరోవైపు, సొంతగడ్డపై 2017 తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ చారిత్రాత్మక విజయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది.

Spotlight

Read More →