చెన్నై ట్రేడ్ సెంటర్లో ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్..
రిబ్బన్ కటింగ్ చేసిన ప్రారంభించిన మంత్రి..
చెన్నై: చెన్నై ట్రేడ్ సెంటర్లో CII మరియు IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ప్రారంభం అనంతరం మంత్రి ఎగ్జిబిషన్ను సందర్శించి, గేమింగ్ మరియు ఈ-స్పోర్ట్స్ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతికతలు, కొత్త ట్రెండ్స్పై ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రదర్శనలో ఉన్న పలు స్టాళ్లను పరిశీలిస్తూ, యువతకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు.
తదుపరి జరిగిన కాన్ఫరెన్స్లో దేశ, విదేశాల ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, గేమింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ యువతకు విస్తృత అవకాశాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్గా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో IDGS అధ్యక్షుడు రాజన్ నవానీ, వైస్ ప్రెసిడెంట్ సీన్ సోన్ను మంత్రి అభినందించారు. అలాగే IDGS సెక్రటేరియట్ సభ్యులు సుభాష్ సర్పు, మధురిమ మణియర కూడా పాల్గొన్నారు. ఇటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు గేమింగ్ రంగ అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.