NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! Annamacharya Jayanthi: ఐరోపాలో భక్తిభావాన్ని నింపిన అన్నమయ్య సంకీర్తనల సుగంధం... 618వ జయంతి ఉత్సవాలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! Annamacharya Jayanthi: ఐరోపాలో భక్తిభావాన్ని నింపిన అన్నమయ్య సంకీర్తనల సుగంధం... 618వ జయంతి ఉత్సవాలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు!

Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో సంచలనానికి రంగం సిద్ధమైంది. నగరంలోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌లో ఉన్న రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూములకు ఎకరాకు కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) ఏకంగా రూ.139 కోట్లుగా నిర్ధారించడం విశేషం.

Published : 2026-05-12 20:29:00
  • ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టించే అవకాశం..
     
  • Real Estate: గతంలో ఇదే ప్రాంతంలో గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన ఎకరా భూమి..

Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని రాయదుర్గం పాన్మక్తాలో ఉన్న 11.38 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మే 6న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూములకు ఎకరాకు కనీస ధరను (అప్‌సెట్ ప్రైస్) ఏకంగా రూ.139 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. మొత్తం భూమిని రెండు ప్లాట్లుగా విభజించి 'యాజ్ ఈజ్ వేర్ ఈజ్' ప్రాతిపదికన ఎంఎస్ టీసీ లిమిటెడ్ ద్వారా ఈ-వేలం నిర్వహించనున్నారు.

వేలం షెడ్యూల్ ప్రకారం, 6.29 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ 1A & 1F కు మే 28, 2026న ఉదయం 10:30 గంటల నుంచి వేలం ప్రక్రియ మొదలవుతుంది. అలాగే 5.09 ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ P4 కు జూన్ 1, 2026న వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనదలచిన సంస్థలు లేదా డెవలపర్లు ఒక్కో ప్లాటుకు రూ.10 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ సమయంలో ఎకరాకు కనీసం కోటి రూపాయల చొప్పున పెంచుతూ వెళ్లాలని నిబంధన విధించారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు మే 18న రాయదుర్గంలోని టీ-హబ్‌లో ప్రీ-బిడ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

ఈ భూములు హైటెక్ సిటీ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల వీటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. క్వాల్‌కామ్ భవనానికి ఎదురుగా, టీ-హబ్ మరియు టీ-వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక కేంద్రాలకు అతి దగ్గరలో ఉండటమే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్ మరియు మెట్రో స్టేషన్లకు మెరుగైన కనెక్టివిటీ ఉండటం ఈ ప్లాట్ల ప్రత్యేకత. ఇవి మల్టీ-యూజ్ జోనింగ్‌లో ఉన్నందున వాణిజ్య, నివాస లేదా హాస్పిటాలిటీ రంగాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అనువుగా ఉంటాయి. గతంలో 2025 అక్టోబర్‌లో జరిగిన వేలంలో ఎకరా గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన నేపథ్యంలో, ఈసారి అప్‌సెట్ ధరను పెంచినప్పటికీ కార్పొరేట్ సంస్థల నుంచి భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వేలం ఫలితాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశను నిర్దేశిస్తాయని భావిస్తున్నారు.

Spotlight

Read More →