West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్! Khushbu Sundar: తమిళనాట మళ్లీ సనాతన మంటలు: సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సుందర్ సూటి ప్రశ్నలు! Nara Lokesh: భాష ఏదైనా గుండె చప్పుడు ఒక్కటే.. అస్సాం బాలిక తెలుగు పాటపై లోకేష్ ఫిదా.! Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు! Vijay movie: రాజకీయాల కంటే అభిమానుల ప్రేమే మిన్న: 'జన నాయగన్' టైటిల్‌పై సీఎం విజయ్ కీలక నిర్ణయం! Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్! Khushbu Sundar: తమిళనాట మళ్లీ సనాతన మంటలు: సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సుందర్ సూటి ప్రశ్నలు! Nara Lokesh: భాష ఏదైనా గుండె చప్పుడు ఒక్కటే.. అస్సాం బాలిక తెలుగు పాటపై లోకేష్ ఫిదా.! Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు! Vijay movie: రాజకీయాల కంటే అభిమానుల ప్రేమే మిన్న: 'జన నాయగన్' టైటిల్‌పై సీఎం విజయ్ కీలక నిర్ణయం! Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ!

Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన!

Tirupati: తిరుపతిలో గంజాయి వ్యవహారం రాజకీయ వేడిని రాజేసింది. భూమన కుటుంబానికి చెందిన అనుచరుడు భాను గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 2026-05-16 10:58:00

గంజాయి వ్యవహారంపై తిరుపతిలో మహిళల భారీ నిరసన..

భూమన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో మహిళల బైఠాయింపు..

తిరుపతిలో గంజాయి వ్యవహారం రాజకీయ వేడిని రాజేసింది. భూమన కుటుంబానికి చెందిన అనుచరుడు భాను గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. భూమన అభినయరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

నిరసనలో పాల్గొన్న మహిళలు “దోపిడీదారుల నుంచి తిరుమల, తిరుపతిని రక్షించుకుందాం”, “యువతను గంజాయి మత్తులోకి నెట్టొద్దు” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గంజాయి కారణంగా యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చుతున్నారని ఆరోపిస్తూ భూమన అభినయరెడ్డి, భాను పేర్లను ప్రస్తావించారు.

“పవిత్రమైన తిరుపతి నగరాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు ఆగాలి”, “యువకుల జీవితాలతో ఆటలాడొద్దు” అంటూ మహిళలు నినాదాలు చేశారు. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పేర్కొన్నారు. భాను అరెస్టుతో అసలు నెట్‌వర్క్ బయటపడాలని, ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, మహిళల శాంతియుత నిరసన మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపణలు వినిపించాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, కొందరు వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మహిళలు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసన కొనసాగించారు. గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని తిరుపతి యువతను రక్షించాలని, రాజకీయ అండతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spotlight

Read More →