Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష!

Middle East Crisis హార్ముజ్ జలసంధి దిగ్బంధనం.. గల్ఫ్ భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ అప్రమత్తం...!

Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కువైట్ సింగపూర్ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం ప్రభావం గల్ఫ్‌లోని భారతీయుల క్షేమంపై ఈ చర్చలు జరిగాయి.

Published : 2026-04-14 08:17:00

Middle East Crisis: గల్ఫ్ ప్రాంతంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనం విధిస్తున్న తరుణంలో ఆయన కువైట్, సింగపూర్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల్లో ప్రధానంగా అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత, ప్రాంతీయ శాంతిపై సుదీర్ఘంగా చర్చించారు.

కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జబర్ అల్-అహ్మద్ అల్-సబాతో జైశంకర్ జరిపిన సంభాషణలో.. కువైట్‌లో ఉన్న లక్షలాది మంది భారతీయ కార్మికుల సంక్షేమం గురించి ఆరా తీశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మనవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం "కువైట్ మంత్రితో మంచి చర్చలు జరిగాయి. ప్రాంతీయ పరిస్థితులతో పాటు మన భారతీయుల క్షేమం గురించి మాట్లాడుకున్నాం" అని జైశంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరోవైపు సింగపూర్ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం గురించి వీరు చర్చించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవుల్లోకి ఏ నౌక వెళ్లకుండా, బయటకు రాకుండా అమెరికా సైన్యం దిగ్బంధనం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న 'హార్ముజ్ జలసంధి'పై ఈ ఆంక్షలు అమలులోకి రావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.

అమెరికా చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరుకుంది. భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. బంగారం సుమారు 1.55 లక్షలకు చేరగా, వెండి కేజీ 2.47 లక్షలకు పెరగడం సామాన్యులను భయపెడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల ఉపాధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Spotlight

Read More →