JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం! MLC Greeshma: వైసీపీ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం! చంద్రబాబు నేతృత్వంలో పునర్వైభవం... ఎమ్మెల్సీ గ్రీష్మ! Mining Scam: మైనింగ్ వివాదంలో అధికారుల నిర్లక్ష్యం..! అటవీ శాఖ సమన్లు జారీ! Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు బిగ్ అప్డేట్! కీలక నిందితుడు అరెస్ట్.... JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం! MLC Greeshma: వైసీపీ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం! చంద్రబాబు నేతృత్వంలో పునర్వైభవం... ఎమ్మెల్సీ గ్రీష్మ! Mining Scam: మైనింగ్ వివాదంలో అధికారుల నిర్లక్ష్యం..! అటవీ శాఖ సమన్లు జారీ! Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు బిగ్ అప్డేట్! కీలక నిందితుడు అరెస్ట్....

IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం!

IronDome: ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య భారీ రక్షణ ఒప్పందాలు జరిగాయి. గోల్డెన్ హొరైజన్ మిసైల్ మరియు ఐరన్ బీమ్ వంటి అత్యాధునిక ఆయుధాల సేకరణతో పాటు, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి 'హెక్జాగాన్' అనే కూటమిలో చేరడం వంటి కీలక చర్చలు జరిగాయి.

Published : 2026-02-27 09:49:00

చైనా, పాక్ బార్డర్‌ల వద్ద పెరగనున్న నిఘా…

ఇజ్రాయెల్ భారత్‌ను ఎందుకు అంతగా నమ్ముతుంది…

పాకిస్థాన్‌కు చుక్కలు చూపించే 'గోల్డెన్ హొరైజన్'…

IronDome: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు తొమ్మిది ఏళ్ల విరామం తర్వాత ఫిబ్రవరి 25, 26 తేదీలలో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోడీ గారికి ఘన స్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి మరియు పరస్పర గౌరవానికి నిదర్శనం. మోడీ గారు గతంలో 2017లో మొదటిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించగా, ఇప్పుడు మళ్ళీ ఈ కీలక పర్యటన చేపట్టారు. ఇజ్రాయెల్ ఏ దేశానికైనా ఇంతటి ఘన స్వాగతం పలకడం చాలా అరుదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ రంగానికి (Defence) సంబంధించిన కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన 'గోల్డెన్ హొరైజన్' (Golden Horizon) మిసైల్‌ను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మిసైల్ రేంజ్ మన బ్రహ్మోస్ కంటే ఎక్కువగా, దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇజ్రాయెల్ తన అత్యాధునిక సాంకేతికతను ఏ దేశానికి పడితే ఆ దేశానికి ఇవ్వదు, కానీ భారత్‌ను 100% నమ్ముతుంది కాబట్టి ఈ టెక్నాలజీని బదిలీ చేయడానికి అంగీకరించింది. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది.

రక్షణ వ్యవస్థలో భారత్ తన సొంత 'సుదర్శన చక్ర' (Sudarshana Chakra) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ సహాయం చేయనుంది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ప్రసిద్ధ 'ఐరన్ డోమ్' వంటి సాంకేతికతను భారత్‌తో పంచుకోవడం ద్వారా మన సరిహద్దులు మరింత సురక్షితం కానున్నాయి. దీంతో పాటు లేజర్ టెక్నాలజీతో పనిచేసే 'ఐరన్ బీమ్' వెపన్స్‌ను కూడా భారత్ కొనుగోలు చేయబోతోంది. ఈ అత్యాధునిక ఆయుధాలు మన సైన్యానికి తోడైతే, పాకిస్థాన్ లేదా చైనా వంటి పొరుగు దేశాలు మన జోలికి రావడానికి వంద సార్లు ఆలోచించాల్సి ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ 'హెక్జాగాన్ ఆఫ్ అలయన్స్' (Hexagon of Alliance) పేరుతో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆరు దేశాలతో కూడిన ఈ గ్రూప్ ప్రధానంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పనిచేస్తుంది. ఈ కూటమిలో చేరాల్సిందిగా ఇజ్రాయెల్ మన దేశాన్ని ఆహ్వానించింది. భారత్‌తో పాటు సైప్రస్, గ్రీస్ వంటి దేశాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ కూటమి వల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో మరియు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడంలో భారత్‌కు ఎంతో మేలు జరుగుతుంది.

Spotlight

Read More →