National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు!

Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..!

Corporation Scam: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడేళ్లుగా సాగుతున్న లెస్ టెండర్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 30 శాతం లెస్ టెండర్లను అధికారుల సాయంతో 0.1 శాతానికి మార్చి 96 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందారు. సుమారు 200 ఫైళ్లు మాయమవ్వడంపై కొత్త కమిషనర్ సీరియస్ విచారణకు ఆదేశించారు.

Published : 2026-03-18 11:32:00

ఇంజినీరింగ్ విభాగంలో భారీ స్కామ్…

గుంటూరు స్కామ్‌లో షాకింగ్ వివరాలు…

టౌన్ ప్లానింగ్ నుంచి ఇంజినీరింగ్ వరకు…

Corporation Scam: గుంటూరు నగర పాలక సంస్థలో గత కొన్నేళ్లుగా సాగుతున్న భారీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా 'లెస్ టెండర్ల' (Less Tenders) వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు దక్కించుకోవడానికి తొలుత తక్కువ ధరకు టెండర్లు వేసి, ఆ తర్వాత అధికారుల అండతో వాటిని మార్పిడి చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 96 మంది కాంట్రాక్టర్లు ఈ మాయాజాలానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ స్కామ్ జరిగిన తీరు అత్యంత విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోవడానికి 30 నుండి 40 శాతం తక్కువ (Less) ధరకు కోట్ చేస్తారు. అయితే, పని దక్కించుకున్న తర్వాత ఇంజినీరింగ్ విభాగంలోని అధికారుల సహకారంతో ఆ టెండర్ విలువను రికార్డుల్లో మార్చేవారు. 40 శాతం లెస్ ఉండాల్సిన దానిని కేవలం 0.1 శాతానికి మార్చి, ప్రభుత్వ సొమ్మును జేబుల్లో నింపుకున్న వైనం టీవీ5 ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి వచ్చింది. అధికారుల కళ్లముందే ఏడేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.

ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 30 మంది ఇంజినీరింగ్ అధికారులు మరియు 96 మంది కాంట్రాక్టర్లు బాధ్యులుగా ఉన్నట్లు ఉన్నతాధికారుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం ఇంజినీరింగ్ విభాగమే కాకుండా, టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించిన కీలకమైన 200 ఫైళ్లు ప్రస్తుతం కార్యాలయంలో మాయమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆధారాలను రూపుమాపేందుకే కావాలని ఈ ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గుంటూరు కార్పొరేషన్‌కు కొత్తగా వచ్చిన కమిషనర్ ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. గత ఏడేళ్ల కాలంలో జరిగిన ప్రతి పనికి సంబంధించిన లెక్కలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను, కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కొత్త కమిషనర్ స్పష్టం చేశారు. దీనితో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 

Spotlight

Read More →