New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు! AP Farmers: ఏపీలో రైతులకు ఊరట... మంత్రి కీలక ప్రకటన! రెండు నెలల్లోనే.... Praja Vedika: నేడు (02/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు! AP Farmers: ఏపీలో రైతులకు ఊరట... మంత్రి కీలక ప్రకటన! రెండు నెలల్లోనే.... Praja Vedika: నేడు (02/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Garikapati Narasimha: ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు కోసం రిక్వెస్ట్.. కొత్త పేరు ఏంటో తెలుసా? తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు...

Garikapati Narasimha Demands Rename Andhrapradesh: కేరళ రాష్ట్రం తన పేరును ‘కేరళం’ గా మార్చుకోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాతృభాషపై మక్కువతో కేరళ ప్రభుత్వం చేసిన ఈ మార్పును చూసి, మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇప్పుడు అలాంటి డిమాండ్లే వినిపిస్తున్నాయి.

Published : 2026-03-02 13:11:00
  • ఆంధ్రప్రదేశ్ పేరును మార్చండి.. సంచలనం..
     
  • ఏపీ పేరు మార్చాలంటూ గరికపాటి వ్యాఖ్యలు..

Garikapati Narasimha Demands Rename Andhrapradesh: కేరళ రాష్ట్రం తన పేరును ‘కేరళం’ గా మార్చుకోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాతృభాషపై మక్కువతో కేరళ ప్రభుత్వం చేసిన ఈ మార్పును చూసి, మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇప్పుడు అలాంటి డిమాండ్లే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు అమలాపురంలో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మన రాష్ట్రం పేరును కూడా ‘తెలుగునాడు’గా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. గరికపాటి గారు కేరళ ప్రజల భాషాభిమానాన్ని మెచ్చుకుంటూ, మనకు కూడా అటువంటి పట్టుదల ఉండాలని కోరారు.

ఎన్టీఆర్ ఆశయం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారికి తెలుగు భాష అంటే ప్రాణం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్రం పేరును 'తెలుగునాడు'గా మార్చాలని గరికపాటి డిమాండ్ చేశారు.
భాషా ప్రాముఖ్యత: "ఆంధ్రప్రదేశ్ అనేది అసలు తెలుగు మాట కాదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగే ఇది కూడా ఒక పేరు మాత్రమే. పొరుగున ఉన్న తమిళనాడు మాదిరిగా మనకు కూడా మన భాషను ప్రతిబింబించేలా 'తెలుగునాడు' అనే పేరు ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు. కేరళ వాళ్లు కేవలం ఒక 'సున్నా' కోసం (కేరళ నుంచి కేరళం) అంత పోరాటం చేసినప్పుడు, మన భాషా పేరు కోసం మనం ఎందుకు అడగకూడదని ఆయన ప్రశ్నించారు.

ఐదో తరగతి వరకు తెలుగు మీడియం తప్పనిసరి!
భాష అనేది కేవలం మాట్లాడటానికే కాదు, మన అస్తిత్వానికి ప్రతీక అని గరికపాటి నొక్కి చెప్పారు.
మాతృభాషలో విద్యాభ్యాసం: తెలుగు భాష బతకాలంటే కనీసం ఐదో తరగతి వరకు తెలుగు మీడియం తప్పనిసరి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని మరియు తల్లిదండ్రులను కోరారు.
సొంత అనుభవం: తన ఇద్దరు పిల్లలను తాను తెలుగు మీడియంలోనే చదివించానని, దానివల్ల వారు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోలేదని ఆయన ఉదాహరణగా చెప్పారు. ఇంగ్లీష్ రాకపోతే బతుకు ఉండదు అనే భయం నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని, మాతృభాషలో పునాది బలంగా ఉంటే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చని ఆయన హితబోధ చేశారు.

ఒత్తిడి లేని జీవితం.. ఆత్మసిద్ధి మార్గం
మనుషులు ఇప్పుడు యంత్రాలలా మారిపోయి, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆందోళనలోనే గడుపుతున్నారని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
మహర్షుల మార్గం: మన పూర్వీకులు, మహర్షులు చూపిన ప్రశాంతమైన జీవన మార్గాన్ని మనం విస్మరించడం వల్లే ఈ ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.
తెలుగు వాచకంలో పాఠాలు: ఆత్మసిద్ధి మరియు ప్రశాంతత కోసం మన తెలుగు వాచకాల్లోనే గొప్ప విషయాలు ఉన్నాయని, వాటిని మన పిల్లలకు నేర్పించాలని సూచించారు.

భారతదేశం విశ్వగురువుగా మారాలంటే?
దేశాభిమానం, భాషాభిమానం ఉన్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మేధో వలసలు వద్దు: మన దేశంలో చదువుకుని, ఇక్కడే పని చేయాలనే పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. అందరూ విదేశాలకు వెళ్లాలనే కాకుండా, సొంత దేశం కోసం పనిచేస్తే రాబోయే ఐదేళ్లలోనే భారతదేశం ప్రపంచానికి 'విశ్వగురువు'గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మన బతుకులు మారాలి.. పట్టుదల పెరగాలి!
"కేరళ వాళ్లు తమ రాష్ట్రం పేరు మార్చుకున్నట్లుగా, మనలో కూడా ఆ స్థాయిలో పట్టుదల రావాలి. అప్పుడే కేవలం రాష్ట్రం పేరే కాదు, మన బతుకులు కూడా మారుతాయి" అని గరికపాటి గారు గంభీరంగా వ్యాఖ్యానించారు. ఈ మార్పు మన ఆలోచనల నుంచే మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలుగు పేరు కోసం ఏన్టీఆర్ కృషి..
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఆంధ్ర అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుందని.. తెలుగు అనేది భాషాపరంగా అందర్నీ ఏకం చేస్తుందని ఆయన నమ్మారు. అందుకే రాష్ట్రం పేరు మార్చే విషయమై ఆయన అసెంబ్లీలో చర్చలు జరిపారు. కొందరు ఆయన ఆలోచనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాష్ట్రం పేరును మార్చలేకపోయారు. అయినప్పటికీ.. తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథం లాంటి పేర్లతో ఆయన తెలుగు పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.

Spotlight

Read More →