Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన!

Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!!

Chandrababu Interacts with Farmers: వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, వలసలు ఆగిపోతాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పనుల్లో వేగం పెరుగుతుందని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

Published : 2026-02-25 16:58:00

వెలిగొండ ప్రాజెక్టుకు కీలక మైలురాయి..

 గంటవానిపల్లెలో ఫీడర్ కాలువకు సీఎం శంకుస్థాపన!

రైతుల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా అడుగు..

Chandrababu Interacts with Farmers:ప్రకాశం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దోర్నాల మండలం గంటవానిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి, వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో కాలువ పనులను పరిశీలించి, అక్కడి భౌగోళిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం అరటి, బొప్పాయి వంటి వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలమని రైతులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎంకు, పనుల వేగం గురించి ఇంజనీర్లు కీలక వివరాలు వెల్లడించారు. సుమారు 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్థ్యంతో ఈ ఫీడర్ కాలువను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే మే నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. కేవలం 45 రోజుల్లోనే 45 టీఎంసీల నీటిని డ్రా చేసి, నల్లమలసాగర్‌ను పూర్తిగా నింపేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కాలువను చారిత్రక కంబం చెరువుకు కూడా అనుసంధానించినట్లు అధికారులు వివరించారు. దీనివల్ల ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు జలకళ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కేవలం ప్రధాన కాలువలే కాకుండా, స్థానికంగా ఉన్న చిన్న చిన్న చెరువులను కూడా నింపేలా అవసరమైన  నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఈ నీటి ఫలాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, పోరుమామిళ్ల, రాచర్ల వంటి దూర ప్రాంతాలకు కూడా చేరేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ఎకరాకు నీరు అందడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ హెలికాప్టర్ ద్వారా నల్లమలసాగర్ ఫీడర్ కెనాల్‌ను నిశితంగా పరిశీలించి, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, వలసలు ఆగిపోతాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పనుల్లో వేగం పెరుగుతుందని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు  సిద్ధమవుతున్నారు.

Spotlight

Read More →