Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం...

Amaravathi: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు! ప్రమాదాలా? కుట్రలా? సమగ్ర విచారణకు సీఎం ఆదేశం!

Amaravathi Fire Accidents:

Published : 2026-03-24 18:17:00

రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చండి.. 

పనులు వేగంగా జరుగుతున్న వేళ వరుస ఘటనలు… ప్రమాదాలా, కుట్రలా?

కారణాలు వెలికి తీయండి : ముఖ్యమంత్రి చంద్రబాబు

రాజధాని ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస అగ్నిప్రమాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనలు సాధారణ ప్రమాదాలేనా, లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా అన్న అంశంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

వరుస ఘటనలపై అనుమానాలు 
రాజధాని పరిధిలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం గమనించాల్సిన విషయమని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటనల తీరు చూస్తుంటే దానిలో కుట్ర కోణం ఉండే అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

రాయపూడి ఘటనపై సమీక్ష 
రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ స్థలంలో నిర్మాణ సంస్థకు చెందిన పైపులు అగ్నికి ఆహుతి కావడం నేపథ్యంలో సీఎం సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ కుమార్ గుప్తా, వకుల్ జిందాల్, మహేష్ కుమార్ లడ్హా పాల్గొన్నారు.

ప్రమాదం జరిగిన సమయం, ఫైర్ సర్వీసులకు సమాచారం అందిన సమయం వంటి అంశాలపై సీఎం స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం అంత వేగంగా వ్యాపించడానికి కారణాలు ఏమిటన్న విషయంపై ఫోరెన్సిక్ ఆధారాలతో స్పష్టత తీసుకురావాలని సూచించారు.

భద్రతా చర్యలు కఠినతరం 
రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన సామగ్రి యార్డుల్లో నిల్వ ఉండటం వల్ల భద్రతా లోపాలు భారీ నష్టాలకు దారితీసే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు.

సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా తప్పనిసరి 
నిర్మాణ సంస్థలు తమ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. భద్రతా పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాల వినియోగాన్ని కూడా పెంచాలని తెలిపారు.

అదనపు పెట్రోలింగ్ 
పోలీసులు రాజధాని పరిధిలో అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి అవసరమైతే వారిని ప్రశ్నించాలని సూచించారు.

కుట్ర తేలితే కఠిన చర్యలు 
వరుస ఘటనల వెనుక ఎవరైనా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తేలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సీఎం హెచ్చరించారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నిర్మాణ పనులకు ఆటంకం రాకూడదు 
రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని సీఎం పేర్కొన్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని తెలిపారు.

అమరావతిలో జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించడం, భద్రతా చర్యలు కఠినతరం చేయడం ద్వారా రాజధాని నిర్మాణం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 

Spotlight

Read More →