- ప్రపంచ స్థాయి రాజధానిగా ముస్తాబవుతున్న అమరావతి: క్షేత్రస్థాయిలో మారుతున్న మహా నగర స్వరూపం!
- Politics: బిట్స్ పిలానీ ఏఐ (AI+) క్యాంపస్.. ₹1000 కోట్ల పెట్టుబడి: విద్యార్థుల భవిష్యత్తుకు అమరావతి వేదిక!
Amaravati Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం అమరావతి ఒక భారీ నిర్మాణ ప్రాంతంలా మారుతోంది. గూగుల్ మ్యాప్స్ మరియు క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, అక్కడ జరుగుతున్న మార్పులు, కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల గురించి ఈ వివరాలు మీకోసం.
రవాణా వ్యవస్థ మరియు కొత్త వంతెనలు
మనం హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 65 ద్వారా వస్తుంటే, ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. కృష్ణ వెస్ట్రన్ డెల్టా మెయిన్ కెనాల్ మీద సుమారు 128 మీటర్ల పొడవుతో ఒక స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఒకసారి ఈ బ్రిడ్జి మరియు దానికి అనుసంధానంగా ఉన్న త్రీ రోడ్స్ (Three Roads) పనులు పూర్తయితే, ఇక మనకు పాత కరకట్ట రోడ్డుతో పని ఉండదు. దీనివల్ల ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి, రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇప్పటికే రోడ్లు సిద్ధమవుతున్నాయి.
ఆధ్యాత్మికత మరియు విద్యకు నిలయం
వెంకటపాలెం గ్రామం దగ్గర ఉన్న టిటీడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ ఆలయాన్ని 25.4 ఎకరాల్లో, సుమారు 260 కోట్ల రూపాయలతో భారీగా విస్తరిస్తున్నారు. ఇక్కడ ఏడు అంతస్తుల మహారాజగోపురం, రత్న మండపం, పుష్కరణి మరియు అన్నదానం కాంప్లెక్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు రాబోతున్నాయి.
మరోవైపు, విద్యా రంగంలో బిట్స్ పిలానీ (BITS Pilani) తన ఏఐ ప్లస్ (AI+) క్యాంపస్ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. 70 ఎకరాల్లో, 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ప్రారంభంలో 3000 మంది, భవిష్యత్తులో 7000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది.
సాంకేతికత మరియు బ్యాంకింగ్ హబ్
అమరావతి కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, సాంకేతిక హబ్గా కూడా మారుతోంది. తాళాయపాలెం మరియు వెలగపుడి పరిసరాల్లో క్వాంటం వ్యాలీ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఐబిఎం (IBM) మరియు టిసిఎస్ (TCS) సంయుక్తంగా భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతున్నాయి. దీని కోసం మొత్తం ఎనిమిది టవర్లను నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఉద్దండరాయిని పాలెం దగ్గర బ్యాంకింగ్ జోన్ వస్తోంది, అక్కడ ఎస్బిఐ (SBI) కి ఇప్పటికే 3 ఎకరాలు కేటాయించారు.
పరిపాలన భవనాలు మరియు అసెంబ్లీ
అమరావతి గుండెకాయ వంటి ప్రాంతంలో ఏపీ సెక్రటేరియట్ మరియు అసెంబ్లీ నిర్మాణాలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ: ఇది 250 మీటర్ల ఎత్తుతో ఒక ఐకానిక్ టవర్లా ఉండబోతోంది.
సెక్రటేరియట్: ఇక్కడ ఐదు భారీ టవర్లను నిర్మిస్తున్నారు, ఇందులో మెయిన్ టవర్ 45 నుండి 50 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. సుమారు 16,000 మంది ఉద్యోగులు ఇక్కడ పని చేసేలా దీనిని రూపొందించారు.
హైకోర్టు: నేలపాడు దగ్గర 800 కోట్ల రూపాయలతో కొత్త హైకోర్టు భవనం నిర్మిస్తున్నారు, ఇందులో 52 కోర్టు హాళ్లు ఉంటాయి.
ఏపీసీఆర్డీఏ ఆఫీస్: ఇప్పటికే జడ్ ప్లస్ 7 (G+7) అంతస్తులతో సిఆర్డిఏ ఆఫీస్ బిల్డింగ్ సిద్ధమైంది.
ఉద్యోగులు మరియు ప్రజా ప్రతినిధుల నివాసాలు
అమరావతిలో పని చేసే వారి కోసం అత్యాధునిక వసతులతో నివాస సముదాయాలు నిర్మిస్తున్నారు:
ఎమమెల్యే మరియు ఎమఎల్సి క్వార్టర్స్: 12 టవర్లలో 288 ఫ్లాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి.
ఐఏఎస్/ఐపిఎస్ ఆఫీసర్స్ నివాసాలు: ఇక్కడ 6 టవర్లలో 144 యూనిట్లు సిద్ధమవుతున్నాయి.
సీనియర్ ఆఫీసర్స్ బంగ్లాస్: చీఫ్ సెక్రటరీ, డిజీపి వంటి వారి కోసం 90 నుంచి 100 బంగ్లాలు నిర్మిస్తున్నారు.
గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌసింగ్: గ్రూప్ ఏ, బి, సి, డి ఉద్యోగుల కోసం సుమారు 30 టవర్లలో 3000 కు పైగా ఫ్లాట్లు ప్లాన్ చేశారు. సామాన్య ప్రజల కోసం 'హ్యాపీనెస్ట్' (Happy Nest)పేరుతో 12 టవర్లలో 1200 ప్రీమియం ఫ్లాట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
వినోదం మరియు పర్యావరణం
శాకమూరు దగ్గర 50 ఎకరాల్లో శాకమూరు రిజర్వాయర్ మరియు సెంట్రల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్లో రోజ్ గార్డెన్, అడ్వెంచర్ పార్క్ వంటివి పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. అలాగే, మార్చి 16, 2026న ఇక్కడ 58 అడుగుల ఎత్తు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా ప్రారంభించారు, ఇది మన రాష్ట్ర వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అమరావతిలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే, అతి త్వరలోనే ఇది ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందని ఆశించవచ్చు.