Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!!

AP Skill Hub Program 2026: నిరుద్యోగులకు సర్కార్ భరోసా ప్రతి నియోజకవర్గంలో 'స్కిల్ హబ్'.. 120 రోజుల ఉచిత ట్రైనింగ్..!!

AP Skill Hub Program 2026: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేసి, 90 నుంచి 120 రోజుల పాటు వెబ్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జాబ్ మేళాల ద్వారా తక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

Published : 2026-04-11 16:06:00

AP Skill Hub Program 2026:  చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, కంపెనీలకు కావాల్సిన నైపుణ్యం  ఉంటేనే ఈ రోజుల్లో మంచి జీతంతో కూడిన కొలువులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 'స్కిల్ హబ్' లను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా యువతకు 90 నుంచి 120 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత నేరుగా కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రస్తుతం చాలామంది యువత ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలు పూర్తి చేసినా, ఐటీ  ఇతర పరిశ్రమల్లో అడుగుపెట్టడానికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) రంగంలోకి దిగింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ కోర్సులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. విజయవాడ వంటి నగరాల్లో ఇప్పటికే వెబ్ డెవలపర్ కోర్సులకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్ వంటి కీలకమైన అంశాలను నేర్పిస్తున్నారు.

ఒకప్పుడు శిక్షణ కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని నిరుద్యోగుల ఇంటి దగ్గరకే తీసుకొచ్చింది. ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లేదా ఐటీఐ కళాశాలల్లో ఈ స్కిల్ హబ్‌లను నిర్వహిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో మేలు జరుగుతుంది. శిక్షణ పొందే అభ్యర్థులకు అత్యాధునిక ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజన్ 2047 లో భాగంగా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి వచ్చే కొత్త కంపెనీలకు మన యువతే ఉద్యోగులుగా మారాలని సీఎం భావిస్తున్నారు. అందుకే స్కిల్ ఇండియా, పీఎంకేవీవై వంటి కేంద్ర పథకాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తున్నారు. ఈ శిక్షణా కాలం ముగిసిన వెంటనే జాబ్ మేళాలు నిర్వహించి, అక్కడికక్కడే అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా ఈ కేంద్రాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టుతో పాటు ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలి, ఆఫీసుల్లో ఎలా నడుచుకోవాలి అనే విషయాలను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఖాళీగా ఉంటున్న మహిళలు, తక్కువ చదువుతో ఆగిపోయిన యువతకు ఈ స్కిల్ హబ్లు ఒక కొత్త ఆశను కలిగిస్తున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని, అప్పటికి సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →