Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! Donald Trump: మాట వినకుంటే రాతియుగానికే.. ఇరాన్ నూతన పాలకుడికి ట్రంప్ తీవ్ర హెచ్చరిక.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా? Gulf Workers: దుబాయ్ నుంచి కోమాలో వచ్చాడు.. కానీ ఆ నిబంధన కొంపముంచింది! అదే ఆ కుటుంబానికి శాపమా... Amaravati Bill: లోక్‌సభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ అభివృద్ధికి ఇదే రాజమార్గం అన్న ఎంపీ కేశినేని చిన్ని! Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! Donald Trump: మాట వినకుంటే రాతియుగానికే.. ఇరాన్ నూతన పాలకుడికి ట్రంప్ తీవ్ర హెచ్చరిక.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా? Gulf Workers: దుబాయ్ నుంచి కోమాలో వచ్చాడు.. కానీ ఆ నిబంధన కొంపముంచింది! అదే ఆ కుటుంబానికి శాపమా... Amaravati Bill: లోక్‌సభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ అభివృద్ధికి ఇదే రాజమార్గం అన్న ఎంపీ కేశినేని చిన్ని! Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్!

Chandrababu: వైసీపీ నేతలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. సిగ్గుపడే స్థితిలో..

Chandrababu Comments On Jagan: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 2026-04-01 15:55:00
  • Politics: "అమరావతి.. పోలవరం.. పేదరిక నిర్మూలన": కూటమి సర్కార్ త్రిముఖ వ్యూహం..
     
  • అమరావతిని ఇక ఇంచ్ కూడా కదల్చలేరు: రాజధానిపై పార్లమెంట్ బిల్లుతో ముగిసిన అడ్డంకులు..

Chandrababu Comments On Jagan: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన రాజకీయ జీవితంలో వైసీపీ వంటి అరాచక పార్టీని ఎక్కడా చూడలేదని, మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ నేతలు ఆనందించారని మండిపడ్డారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా పారిపోయారని విమర్శించారు. నేడు రాష్ట్రంలో ఎవరైనా తాము వైసీపీ కార్యకర్తలం అని చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితిని ఆ పార్టీ నాయకత్వం కల్పించిందని దుయ్యబట్టారు. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవారని, వారు కేవలం బెదిరించి వెళ్లిపోయేవారని, కానీ వైసీపీ నేతలు మాత్రం తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారి వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు.

వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అమరావతిని ఇకపై ఎవరూ అంగుళం కూడా కదిలించలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం రాజధానిపైనే కాకుండా సాగునీటి ప్రాజెక్టులపై కూడా తన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ఏడాది కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, ఉదయగిరి ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తనపై ఉన్న కోపంతో పోలవరం వంటి కీలక ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి వారి నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని పేద వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అందుకోసం 'P4' (Public-Private-People Partnership) విధానాన్ని తీసుకువస్తున్నామని, దీని ద్వారా పేదలను సంపన్నులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలను కేవలం నగదు పంపిణీకే పరిమితం చేయకుండా, ప్రజల ఆదాయ మార్గాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి మరియు పేదరిక నిర్మూలన అనే మూడు లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వింజమూరు వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

Spotlight

Read More →