Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే? Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు! Visakhapatnam: విశాఖ పోర్ట్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ 'L2 గ్రీన్ పోర్ట్' గుర్తింపు సొంతం..! Australia: మెల్‌బోర్న్ విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక చర్చలు! NBK111 Updates: బాలకృష్ణ ‘NBK111’ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. జూన్ 10న రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్! Rajya Sabha: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జనసేన కోటా రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నియామకం..! Tiger Tension: పెద్దపులి టెన్షన్.. గండిపోచమ్మ ఆలయ రహదారిని పూర్తిగా మూసివేసిన అధికారులు! Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే? Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు! Visakhapatnam: విశాఖ పోర్ట్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ 'L2 గ్రీన్ పోర్ట్' గుర్తింపు సొంతం..! Australia: మెల్‌బోర్న్ విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక చర్చలు! NBK111 Updates: బాలకృష్ణ ‘NBK111’ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. జూన్ 10న రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్! Rajya Sabha: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జనసేన కోటా రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నియామకం..! Tiger Tension: పెద్దపులి టెన్షన్.. గండిపోచమ్మ ఆలయ రహదారిని పూర్తిగా మూసివేసిన అధికారులు! Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే!

Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే!

Vijayawada Airport: ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.

Published : 2026-06-05 15:15:00
  • విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు..
     
  • Business: ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం..

Vijayawada Airport: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతితో పాటు చుట్టుపక్కల నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఎంతో కాలంగా ఆధ్యాత్మిక ప్రేమికులు, పర్యాటకులు కోరుకుంటున్నట్లుగా.. విజయవాడ నుంచి నేరుగా పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) కి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం కాబోతోంది.

బాబా విశ్వనాథుడిని దర్శించుకోవాలని అనుకునే విజయవాడ, గుంటూరు మరియు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజలకు ఈ సర్వీస్ పెద్ద ఊరట. ఆగస్టు 13 నుంచి ఈ కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

విమానం వారానికి మూడు రోజులు (ప్రతి మంగళవారం, గురువారం, శనివారం) నడుస్తుంది. సమయాల విషయానికి వస్తే:
వారణాసి టు విజయవాడ: మధ్యాహ్నం 3:55 గంటలకు కాశీలో బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ ల్యాండ్ అవుతుంది.
విజయవాడ టు వారణాసి: తిరిగి సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో టేకాఫ్ అయి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. కేవలం రెండు గంటల లోపే మనం కాశీ చేరుకోవచ్చు. ఒకవైపు టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

కొత్త ఏవియేషన్ పాలసీ.. పెద్ద ప్లాన్!
వారణాసికి ఫ్లైట్ వేయడం అనేది ఒక చిన్న ముక్క మాత్రమే. దీని వెనుక ఏపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్చే వేసింది. 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉండేలా ఒక సరికొత్త విమానయాన విధానాన్ని (Aviation Policy) ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఏపీని దేశంలోనే ఒక పెద్ద ఏవియేషన్ హబ్‌గా మార్చడం. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో దాదాపు రూ.9,575 కోట్ల (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంతేకాదు, విమానాల రిపేర్లు (MRO), విడిభాగాల తయారీ రంగంలో మన యువతకు ఉపాధి దొరికేలా ఏటా 5 వేల మందికి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు.

ప్రతి 150 కిలోమీటర్లకు ఒక ఎయిర్‌పోర్ట్!
ప్రభుత్వం సిద్ధం చేసిన నెట్‌వర్క్ ప్లాన్ వింటే ఎవరికైనా అబ్బా అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన.
కొత్త విమానాశ్రయాలు: దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, అనంతపురం వంటి చోట్ల కొత్తగా ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి.

బడ్జెట్ ఎయిర్‌పోర్ట్స్ & వాటర్‌డ్రోమ్స్: 7 లో-కాస్ట్ (తక్కువ బడ్జెట్) విమానాశ్రయాలతో పాటు టూరిజం పెంచడానికి 10 కి పైగా వాటర్‌డ్రోమ్స్ (నీటిపై ల్యాండ్ అయ్యే విమానాల కోసం), హెలిపోర్టులను కట్టనున్నారు. భవిష్యత్తులో ఏపీలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి దేశంలోని 25 ప్రముఖ నగరాలకు, అలాగే విదేశాల్లోని 10 కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలన్నది ప్రభుత్వ సంకల్పం.

కాశీకి విమాన సర్వీస్ రావడం అనేది సామాన్య భక్తులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. వయసైన వారు కూడా ఇబ్బంది లేకుండా దైవదర్శనం చేసుకునే వీలు కలుగుతుంది. మరోవైపు ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఎయిర్‌పోర్టుల నెట్‌వర్క్ కనుక విస్తరిస్తే.. ఏపీకి పెట్టుబడులు పెరగడమే కాకుండా, ప్రయాణాలు కూడా చాలా ఈజీ అయిపోతాయి!

Spotlight

Read More →