Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే? Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు! Visakhapatnam: విశాఖ పోర్ట్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ 'L2 గ్రీన్ పోర్ట్' గుర్తింపు సొంతం..! Australia: మెల్‌బోర్న్ విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక చర్చలు! NBK111 Updates: బాలకృష్ణ ‘NBK111’ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. జూన్ 10న రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్! Rajya Sabha: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జనసేన కోటా రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నియామకం..! Tiger Tension: పెద్దపులి టెన్షన్.. గండిపోచమ్మ ఆలయ రహదారిని పూర్తిగా మూసివేసిన అధికారులు! Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే? Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు! Visakhapatnam: విశాఖ పోర్ట్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ 'L2 గ్రీన్ పోర్ట్' గుర్తింపు సొంతం..! Australia: మెల్‌బోర్న్ విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం.. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక చర్చలు! NBK111 Updates: బాలకృష్ణ ‘NBK111’ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. జూన్ 10న రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్! Rajya Sabha: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జనసేన కోటా రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నియామకం..! Tiger Tension: పెద్దపులి టెన్షన్.. గండిపోచమ్మ ఆలయ రహదారిని పూర్తిగా మూసివేసిన అధికారులు! Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే!

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స!

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Published : 2026-06-05 12:53:00

ఎబోలా లక్షణాలతో ఇద్దరు సూడాన్ పౌరులకు చికిత్స..

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అనుమానితుల పర్యవేక్షణ..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల వివరాల ప్రకారం, సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అనే వ్యక్తి ఎబోలా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇదే సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అహ్మద్ అనే మరో సూడాన్ పౌరుడికి కూడా ఎబోలా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ ఇద్దరూ ఇటీవల సూడాన్ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమై, వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది.

అనుమానితుల నుంచి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షల కోసం ముందుగా హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. అక్కడి నుంచి తుది నిర్ధారణ కోసం పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (National Institute of Virology) ప్రయోగశాలకు తరలించారు. పరీక్షల నివేదికలు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే ఎబోలా లక్షణాలతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తిని కూడా గుర్తించి, గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. వైద్య నిపుణుల బృందం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అయితే ప్రస్తుతం ఎబోలా వైరస్ నిర్ధారణ కాలేదని, కేవలం అనుమానిత కేసులుగా మాత్రమే వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎబోలా వైరస్‌కు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Spotlight

Read More →