Kommukonam Fish: డీప్ సీలో దొరికిన దైవ కానుక.. 520 కిలోల చేపతో మత్స్యకారుల జాక్‌పాట్..! వేలంలో రికార్డు ధర.. Silver Price 2026: వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఆభరణాల కోసం కాదు.. ఈ కార్ల వల్లే! Guntur Market News: మిర్చి ఘాటు.. ఆ రకానికి అయితే రేటు కూడా హాటు.. గుంటూరు యార్డులో రికార్డులు బద్ధలు..!! BSNL Recharge Offer: రిపబ్లిక్ డే స్పెషల్.. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్..!! పసిడి ప్రియులకు షాక్! అమ్మో .. 10 గ్రాముల బంగారం ధర... ! ఆ రైతులకు పండగే పండగ! మార్కెట్ లో రికార్డ్ స్థాయి కి చేరిన ధరలు... కింటాకు రూ.10 వేలు పై మాటే! Kommukonam Fish: డీప్ సీలో దొరికిన దైవ కానుక.. 520 కిలోల చేపతో మత్స్యకారుల జాక్‌పాట్..! వేలంలో రికార్డు ధర.. Silver Price 2026: వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఆభరణాల కోసం కాదు.. ఈ కార్ల వల్లే! Guntur Market News: మిర్చి ఘాటు.. ఆ రకానికి అయితే రేటు కూడా హాటు.. గుంటూరు యార్డులో రికార్డులు బద్ధలు..!! BSNL Recharge Offer: రిపబ్లిక్ డే స్పెషల్.. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్..!! పసిడి ప్రియులకు షాక్! అమ్మో .. 10 గ్రాముల బంగారం ధర... ! ఆ రైతులకు పండగే పండగ! మార్కెట్ లో రికార్డ్ స్థాయి కి చేరిన ధరలు... కింటాకు రూ.10 వేలు పై మాటే!

Guntur Market News: మిర్చి ఘాటు.. ఆ రకానికి అయితే రేటు కూడా హాటు.. గుంటూరు యార్డులో రికార్డులు బద్ధలు..!!

గుంటూరు మిర్చి యార్డులో రికార్డు స్థాయికి చేరిన ధరలు. దేవ్నూర్ డీలక్స్, తేజా, బ్యాడిగి రకాల ప్రస్తుత ధరలు మరియు ఎగుమతులపై పూర్తి సమాచారం

Published : 2026-01-27 10:21:00
రైలు ప్రయాణికులకు శుభవార్త... ఆ సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకపై అక్కడా ఆగుతాయి!

భారతదేశంలో గుంటూరులో దొరికే ఎండుమిర్చికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం గుంటూరు యార్డులో  కారం ఘాటు కంటే ధర ఘాటే ఎక్కువగా వినిపిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ఆశించిన స్థాయిలో ధరలు లేక ఇబ్బంది పడ్డ రైతులకు, ఈ ఏడాది మార్కెట్ గట్టి ఊరటనిస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్, ఈ సీజన్‌లో దిగుబడి తగ్గడం వంటి కారణాలతో క్వింటా మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మార్కెట్ యార్డు అధికారుల సమాచారం ప్రకారం, ప్రీమియం రకాలకు ఈసారి ఊహించని రేటు లభిస్తోంది. గతేడాదితో పోలిస్తే సగటున 25 శాతం వరకు ధరలు పెరిగాయి.

దేవ్నూర్ డీలక్స్ (DD): మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాకు రూ. 25,000 వరకు పలుకుతోంది.

బ్యాడిగి రకం: దీనికి ఉన్న ప్రత్యేక రంగు, రుచి కారణంగా క్వింటా రూ. 23,000 కు చేరుకుంది.

341 రకం: క్వింటాకు రూ. 22,500 ధర లభిస్తోంది.

తేజా రకం: ఎగుమతులకు ఎక్కువగా వాడే ఈ రకం రూ. 20,500 పలుకుతోంది.

తాలు రకం: తక్కువ నాణ్యత కలిగిన ఈ రకానికి కూడా క్వింటాకు రూ. 11,000 లభిస్తుండటం విశేషం.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు మిర్చి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 2024-25 సీజన్లలో సరైన ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనివల్ల ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. గత ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఈసారి అది కేవలం 1.06 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.

మరొకటిగా అంతర్జాతీయ డిమాండ్ చైనా, సింగపూర్, థాయిలాండ్ మరియు అరబ్ దేశాల నుండి మన మిర్చికి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా 'తేజా' రకానికి విదేశీ మార్కెట్లలో తిరుగులేని డిమాండ్ కలదు. యార్డులో రద్దీ.. రైతులకు సౌకర్యాలు మెరుగైన ధరలు లభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి రైతులు తమ నిల్వలను గుంటూరుకు తరలిస్తున్నారని సమాచారం. 

ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల బస్తాల వరకు అమ్మకానికి వస్తుండగా, రాబోయే రోజుల్లో ఇది లక్ష బస్తాలకు చేరుతుందని అంచనా. రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్ శాఖ అధికారులు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలను మెరుగుపరిచారు. పసుపు మిర్చి ఒక ప్రత్యేక ఆకర్షణ సాధారణ ఎర్ర మిర్చితో పాటు, ఈసారి అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు రకం మిర్చికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇటీవల జరిగిన వేలంలో ఈ రకం ఏకంగా క్వింటా రూ. 44,000 పలికి రికార్డు సృష్టించింది. 

Spotlight

Read More →