- Politics: నాడు నందిగ్రామ్.. నేడు రాష్ట్రమంతా: బెంగాల్లో టీఎంసీ పతనం మొదలైందన్న మోదీ..
- శరణార్థులకు అండ.. చొరబాటుదారులకు గుమ్మం మూత: బెంగాల్ గడ్డపై మోదీ కీలక ప్రకటన…
PM Modi: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. హల్దియాలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గత ఐదేళ్ల క్రితం నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిని చవిచూశారని గుర్తు చేస్తూ, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అదే ఫలితం పునరావృతమవుతుందని విశ్లేషించారు. ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్లో సైతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి ఈ ఎన్నికలు ఒక గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా, టీఎంసీ ప్రభుత్వం అడ్డుతగులుతూ బెంగాల్ అభివృద్ధిని కుంటుపరుస్తోందని మండిపడ్డారు.
యువతకు ఉపాధి కల్పించడంలో మమతా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ హయాంలో జరిగిన మోసాలు, కుంభకోణాలను బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల ముందు ఉంచుతామని, అన్యాయానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బెంగాల్లో 'డబుల్ ఇంజిన్ సర్కార్' ఏర్పడితేనే కేంద్ర పథకాలు క్షేత్రస్థాయిలోకి చేరుతాయని, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని ఆయన హామీ ఇచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, అయితే దేశ భద్రతకు ముప్పుగా మారిన చొరబాటుదారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారిని తరిమికొడతామని మోదీ స్పష్టం చేశారు.