Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Saudi Arabia: హజ్ యాత్రికులకు అలర్ట్.. మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం కీలక ఆంక్షలు! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Saudi Arabia: హజ్ యాత్రికులకు అలర్ట్.. మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం కీలక ఆంక్షలు! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!!

Gulf Victims: “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” – గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఆలస్యం!

Gulf Victims: గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికీ చాలా కుటుంబాలకు అందకపోవడంతో బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 2026-04-13 11:26:00

50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు..

దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు..

జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికీ చాలా కుటుంబాలకు అందకపోవడంతో బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక గల్ఫ్ మృతుడి భార్య ఇటీవల ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారు. “మాకు ఎక్స్‌గ్రేషియా మంజూరు అయ్యింది. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టోకెన్ నెంబర్ కూడా వచ్చింది. కానీ డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో పడలేదు” అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గారు గల్ఫ్ మృతుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. పాస్‌పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అవసరమైన పత్రాలను మండల తహసీల్దార్ల ద్వారా వేగంగా సేకరించి, అర్హులైన కుటుంబాలను గుర్తించి ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపించారు. ఆయన కృషిని పలువురు అభినందిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయబడింది. దీనికి మొత్తం రూ.2.5 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కోరుట్లలో 19, ధర్మపురిలో 14, జగిత్యాలలో 7, వేములవాడలో 6, చొప్పదండిలో 4 కుటుంబాలు ఈ సహాయం కోసం అర్హులుగా గుర్తించబడ్డాయి.

అయితే, మంజూరు ప్రక్రియ పూర్తయినా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. సీఎం హామీ ఇచ్చినా, అమలు దశలో జాప్యం జరగడం బాధిత కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” అన్నట్లుగా పరిస్థితి ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఈ సహాయం ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ అంశంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటేనే, ఆ కుటుంబాలకు నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుంది.

Spotlight

Read More →