Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు! Vontimitta Brahmotsavam: మోహిని అలంకారంలో కోదండరామస్వామి.. భక్తుల కర్పూర నీరాజనాలు.!! Tirumala Darshnam Timings: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... సర్వదర్శనానికి 10 గంటల సమయం! నిన్న హుండీ ఆదాయం.... Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! Camphor Making: కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Tirumala: కలియుగ దైవం సన్నిధిలో భక్తజన సంద్రం... సర్వదర్శనానికి 15 గంటల సమయం! Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా? Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు! Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు! Vontimitta Brahmotsavam: మోహిని అలంకారంలో కోదండరామస్వామి.. భక్తుల కర్పూర నీరాజనాలు.!! Tirumala Darshnam Timings: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... సర్వదర్శనానికి 10 గంటల సమయం! నిన్న హుండీ ఆదాయం.... Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! Camphor Making: కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Tirumala: కలియుగ దైవం సన్నిధిలో భక్తజన సంద్రం... సర్వదర్శనానికి 15 గంటల సమయం! Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా? Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు!

Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏపీ సర్కార్‌కు..విచారణ గడువు పొడిగించాలని ఏకసభ్య కమిషన్ విజ్ఞప్తి.!

Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ తన నివేదిక సమర్పించేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Published : 2026-03-31 12:23:00

Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన గడువును పెంచాలని కోరింది. కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పొడిగించాలని ఆయన విన్నవించారు.

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ప్రభుత్వం ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే విచారణ ప్రక్రియలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరుసగా వచ్చిన సెలవులు, అలాగే విచారణకు హాజరుకావాల్సిన కొందరు కీలక వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో గడువులోగా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్ భావిస్తోంది.

ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన టీటీడీ ఈవోలు, పాలకమండలిలోని కీలక సభ్యుల పాత్రపై కమిషన్ ఆరా తీస్తోంది. నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన అవకతవకలు, నాణ్యత పరిశీలనలో వైఫల్యాల గురించి వారిని ప్రశ్నించాల్సి ఉంది. వీరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన తర్వాతే ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ఛైర్మన్ దినేష్ కుమార్ యోచిస్తున్నారు. అందుకే పూర్తి వివరాలతో కూడిన నివేదిక కోసం మరికొంత సమయం అవసరమని కోరారు.

కమిషన్ చేసిన ఈ విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సున్నితమైన అంశం కావడంతో తొందరపడి అరకొర సమాచారంతో నివేదిక ఇవ్వడం కంటే, అన్ని కోణాల్లో విచారించి పక్కా ఆధారాలతో రిపోర్ట్ ఇవ్వడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు ఇచ్చేందుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం.

 కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరనేది తేలాలంటే ఏప్రిల్ 30 వరకు వేచి చూడక తప్పదు. ఈ గడువు ముగిసేలోగా మాజీ అధికారుల విచారణ పూర్తి చేసి, లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

Spotlight

Read More →