Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!

2025-11-07 09:52:00
Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి!

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) మరోసారి సాంకేతిక సమస్య తలెత్తి విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా పలు దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థల సర్వీసులు సగటున అరగంటకు పైగా ఆలస్యం కాగా, ప్రయాణికులు విమానాల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. కొన్ని విమానాలు రన్‌వేపై నిలిచిపోయి, టేక్ఆఫ్‌కి అనుమతి కోసం వేచి చూశాయి.

ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ!

ఈ సమస్య కారణంగా విమానాశ్రయంలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. బోర్డింగ్ గేట్లు, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల క్యూలు పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ, “మా విమానం రన్‌వేపై సుమారు అరగంటకు పైగా నిలిచిపోయింది. ఏటీసీ సిస్టమ్‌లో గ్లిచ్ వల్లే ఈ జాప్యం జరిగినట్లు సిబ్బంది తెలిపారు,” అని పేర్కొన్నారు. విమానాశ్రయ సాంకేతిక బృందాలు సమస్య పరిష్కారానికి యత్నిస్తున్నాయని, తక్షణమే కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు భరోసా ఇచ్చారు.

AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!!

ఆశ్చర్యకరంగా, ఇదే ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి సాంకేతిక లోపం ఈ వారంలోనే రెండోసారి చోటుచేసుకుంది. కేవలం రెండు రోజుల క్రితం, బుధవారం కూడా ఇలాంటి సమస్య తలెత్తి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా థర్డ్ పార్టీ కనెక్టివిటీ నెట్‌వర్క్‌లో సమస్య తలెత్తిందని, దానివల్ల చెక్-ఇన్ సిస్టమ్‌లు ప్రభావితమయ్యాయని వెల్లడించింది. కొంతసేపటికి సమస్యను సరిచేసి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి పరిస్థితి రావడం ప్రయాణికుల్లో అసహనాన్ని పెంచింది.

Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి!

తాజా ఘటనపై ఇప్పటివరకు ఎయిర్‌లైన్స్ లేదా విమానాశ్రయ అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, విమానాశ్రయంలో సాంకేతిక బృందాలు ఏటీసీ సిస్టమ్‌ను రీసెట్‌ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వరుసగా సమస్యలు తలెత్తడం వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ సాంకేతిక వ్యవస్థల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధిక వాహన రద్దీ, డిజిటల్ సిస్టమ్‌లపై ఆధారపడే కార్యకలాపాల్లో ఇలాంటి లోపాలు తరచుగా వస్తే ప్రయాణికుల భద్రతకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సమగ్ర సమీక్ష చేపట్టి, శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని పర్యవేక్షకులు సూచిస్తున్నారు.

Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?
Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!
Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!
Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!
TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

Spotlight

Read More →