Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! Iran War: అమెరికా, ఇరాన్ సరికొత్త నిర్ణయాన్ని అభినందించిన భారత్.. ప్రపంచ ప్రజలకు ఇది ఎంతో.. EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! Iran War: అమెరికా, ఇరాన్ సరికొత్త నిర్ణయాన్ని అభినందించిన భారత్.. ప్రపంచ ప్రజలకు ఇది ఎంతో.. EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం!

APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

APCPDCL: విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, రైతులకు అంతరాయం లేని విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, నాణ్యమైన సరఫరా కోసం అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.

Published : 2026-04-08 13:01:00

రైతులకు 'విద్యుత్' కష్టాలు ఉండొద్దు…

సీఎం చంద్రబాబు ఆదేశాలే మాకు శిరోధార్యం…

ఛార్జీల పెంపు ఉండదు.. అంతరాయం అస్సలు వద్దు…

APCPDCL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లనే నేడు ఈ రంగానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందని అభినందించారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ నూతన కార్యాలయం ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా, పారదర్శకమైన సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే, సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఆ దిశగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలపై భార పడకుండా నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తీరును మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా ప్రశంసించారు. తుపాన్లు, భారీ వర్షాల సమయంలో అతి తక్కువ సమయంలోనే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల కష్టాలను తీర్చడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యుత్ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు తమ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spotlight

Read More →