Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం!

Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు..

Kerala Election Speech Modi: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు.

Published : 2026-04-05 15:56:00
  • Politics: "గల్ఫ్ దేశాలతో మనది కుటుంబ బంధం": యుద్ధం వేళ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టిన మోదీ..
     
  • "రాజకీయాల కంటే భద్రతే ముఖ్యం": మలయాళీల రక్షణకు కట్టుబడి ఉన్నానన్న ప్రధాని నరేంద్ర మోదీ..

Kerala Election Speech Modi: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పథనంతిట్ట జిల్లా తిరువల్లలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు జనాభాను నియంత్రించినప్పటికీ, నియోజకవర్గాల సంఖ్య పెరగడమే తప్ప తగ్గదని ఆయన భరోసా ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే క్రమంలో స్థానాల పెంపునకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం ఈ నెల 16 నుండి 18 వరకు పార్లమెంటు సమావేశాలను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి 816కు పెరుగుతుందని, ఇది అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వివరించారు.

ఇదే వేదికపై ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న బాధ్యతారహితమైన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, గల్ఫ్ దేశాలు భారత్‌ను శత్రువుగా పరిగణించేలా కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కంటే తనకు మలయాళీలతో పాటు భారతీయులందరి భద్రతే ముఖ్యమని, గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఆయా దేశాలు భారతీయులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాయని, అటువంటి బంధాన్ని రాజకీయ లబ్ధి కోసం పణంగా పెట్టవద్దని కాంగ్రెస్, ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ నేతలకు హితవు పలికారు.

కేరళ అభివృద్ధిపై ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు మరియు గోవాలో బీజేపీ అధికారంలో ఉన్నట్లే, కేరళలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శబరి రైలు ప్రాజెక్టు వంటి కీలక పనులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని, దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కేరళ అభివృద్ధిలో వెనుకబడటానికి ఇక్కడి పాలకుల వైఖరే కారణమని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రగతికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తానని, ఇది 'మోదీ గ్యారంటీ' అని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →