Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! India-UAE: భారత్‌లో యూఏఈ రూ. 42 వేల కోట్ల భారీ పెట్టుబడులు!! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Modi: అబుదాబి పర్యటనకు ప్రధాని మోదీ.. ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు! Iran Attack: యూఏఈలో ఫుజైరా ఆయిల్ సెంటర్ పై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు! Saudi: సౌదీకి గట్టి షాక్.. 60 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. చమురు రాజకీయాల్లో పెను సంచలనం.. UAE Updates: యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు.. మే 1వ తేదీ నుంచి! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! India-UAE: భారత్‌లో యూఏఈ రూ. 42 వేల కోట్ల భారీ పెట్టుబడులు!! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Modi: అబుదాబి పర్యటనకు ప్రధాని మోదీ.. ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు! Iran Attack: యూఏఈలో ఫుజైరా ఆయిల్ సెంటర్ పై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు! Saudi: సౌదీకి గట్టి షాక్.. 60 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. చమురు రాజకీయాల్లో పెను సంచలనం.. UAE Updates: యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు.. మే 1వ తేదీ నుంచి!

PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.!

PM Modi: ప‌శ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తున్నారు.

Published : 2026-05-15 16:33:00
  • భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకారం..
     
  • Politics: ఇంధన భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం..

PM Modi: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని అధిగమించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, భారత ఇంధన భద్రతను పటిష్ఠం చేసుకునేందుకు అబుదాబి వేదికగా కీలక అడుగులు పడ్డాయి. యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు మరియు రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల ఫలితంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరా మరియు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల రంగంతో పాటు ఆర్‌బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్‌లో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు యూఏఈ ఈ సందర్భంగా ప్రకటించింది. వీటితో పాటు గుజరాత్‌లోని వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్‌ ఏర్పాటుకు, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించి కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించిన ప్రధాని మోదీ, యూఏఈపై ఇరాన్ జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. సుమారు 45 లక్షల మంది ప్రవాస భారతీయుల సంక్షేమంపై కూడా చర్చలు జరపడం ద్వారా, యూఏఈ భారత్‌కు కేవలం ఇంధన భాగస్వామిగానే కాకుండా నమ్మకమైన మిత్రదేశంగా కొనసాగుతోందని ఈ పర్యటన మరోసారి నిరూపించింది.

Spotlight

Read More →