Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు!

Vande Bharath: ఏపీలో రైలు ప్రయాణికులకు తీపికబురు! వందేభారత్ రైలు ఇకపై అక్కడా ఆగుతుంది.. ఫుల్ షెడ్యూల్!

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త లభించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్

Published : 2025-12-24 10:39:00

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త లభించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరు చేశారు. ఈ సౌకర్యం డిసెంబర్ 27 నుంచి అమల్లోకి రానుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

20704/20703 నంబర్లతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హిందూపురంలో రెండు నిమిషాల పాటు ఆగనుంది. డిసెంబర్ 27న కాచిగూడ నుంచి వచ్చే రైలుకు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హిందూపురంలో పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీవోఎం ఎన్. రాజ్‌కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి, 3.35 గంటలకు హిందూపురం చేరుకొని కాచిగూడకు కొనసాగుతుంది. ఈ టైమింగ్స్ ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

హిందూపురంలో వందేభారత్ హాల్ట్ కోసం స్థానిక ఎంపీ బీకే పార్థసారథి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రైల్వే మంత్రిని కోరడంతో వెంటనే అనుమతి లభించింది. బెంగళూరు ప్రయాణం కోసం హిందూపురం, అనంతపురం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. వారికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఏపీకి మరో కొత్త రైలు సేవ కూడా త్వరలో ప్రారంభం కానుంది. గుంతకల్లు నుంచి డోన్ మీదుగా మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకు కొత్త ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు గ్రామాలను కలుపుతూ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది. కొత్త రైలు ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుందని రైల్వే శాఖ తెలిపింది.

Spotlight

Read More →