Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం!

Vande Bharath: ఏపీలో రైలు ప్రయాణికులకు తీపికబురు! వందేభారత్ రైలు ఇకపై అక్కడా ఆగుతుంది.. ఫుల్ షెడ్యూల్!

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త లభించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్

Published : 2025-12-24 10:39:00

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త లభించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరు చేశారు. ఈ సౌకర్యం డిసెంబర్ 27 నుంచి అమల్లోకి రానుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

20704/20703 నంబర్లతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హిందూపురంలో రెండు నిమిషాల పాటు ఆగనుంది. డిసెంబర్ 27న కాచిగూడ నుంచి వచ్చే రైలుకు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హిందూపురంలో పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీవోఎం ఎన్. రాజ్‌కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి, 3.35 గంటలకు హిందూపురం చేరుకొని కాచిగూడకు కొనసాగుతుంది. ఈ టైమింగ్స్ ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

హిందూపురంలో వందేభారత్ హాల్ట్ కోసం స్థానిక ఎంపీ బీకే పార్థసారథి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రైల్వే మంత్రిని కోరడంతో వెంటనే అనుమతి లభించింది. బెంగళూరు ప్రయాణం కోసం హిందూపురం, అనంతపురం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. వారికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఏపీకి మరో కొత్త రైలు సేవ కూడా త్వరలో ప్రారంభం కానుంది. గుంతకల్లు నుంచి డోన్ మీదుగా మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకు కొత్త ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు గ్రామాలను కలుపుతూ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది. కొత్త రైలు ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుందని రైల్వే శాఖ తెలిపింది.

Spotlight

Read More →