Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! Cricket: సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా! గతంలోనూ బోర్డుపై.. IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! Cricket: సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా! గతంలోనూ బోర్డుపై.. IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్.,

T20 World Cup: అద్భుతం.. అమోఘం! భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిల.. విజయంపై దేశవ్యాప్తంగా.!

T20 World Cup: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

Published : 2026-03-08 22:54:00
  • ఒంటరి పోరాటం చేసిన టిమ్ సీఫెర్ట్..
     
  • 87 పరుగులకే 5 వికెట్లు - భారత్ విజయం ఖాయం!

T20 World Cup: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు ఏకపక్షంగా మారిపోయింది. భారత్ నిర్దేశించిన 256 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని చూసి కివీస్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. స్టేడియంలో ఉన్న లక్షలాది మంది భారతీయుల నినాదాల మధ్య, మన బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే న్యూజిలాండ్ జట్టు పేకమేడలా కూలిపోతోంది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం నుండే చుక్కలు కనిపించాయి. భారత స్పిన్నర్లు, పేసర్లు పోటీపడి వికెట్లు తీస్తుండటంతో కివీస్ కోలుకోలేకపోయింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫిన్ అలెన్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, ప్రమాదకరమైన రచిన్ రవీంద్రను జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో బోల్తా కొట్టించాడు. రచిన్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం కివీస్‌కు కోలుకోలేని దెబ్బ. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ వంటి హిట్టర్లు కూడా భారత బౌలింగ్ ధాటికి సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ స్టేడియంలో కాసేపు నిశ్శబ్దాన్ని నింపాడు.

కేవలం 26 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లతో 52 పరుగులు చేసి ఫామ్ చాటుకున్నాడు. అయితే, మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన మాయాజాలానికి సీఫెర్ట్ బలైపోయాడు. అతను అవుట్ కావడంతో న్యూజిలాండ్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 9.4 ఓవర్లలోనే 87 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. క్రీజులో డారిల్ మిచెల్, కెప్టెన్ సాంట్నర్ ఉన్నప్పటికీ, లక్ష్యం మాత్రం చాలా దూరంలో ఉంది. కివీస్ విజయానికి ఇంకా 62 బంతుల్లో 169 పరుగులు కావాలి. అంటే ప్రతి ఓవర్‌లో దాదాపు 16 పైగా పరుగులు చేయాలి. భారత బౌలర్లు ఉన్న ఫామ్‌లో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

అంతకుముందు టీమిండియా బ్యాటర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సంజూ శాంసన్ (89) తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా, అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) కివీస్ బౌలర్లను ఉతికారేశారు. ఆఖర్లో శివమ్ దూబే కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. బ్యాటర్లు సృష్టించిన పరుగుల వరదను మన బౌలర్లు వికెట్లతో కాపాడుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో చేయి వేస్తూ కివీస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ మ్యాచ్ చూస్తుంటే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్ గెలవడం ఇప్పుడు కేవలం ఒక లాంఛనంగానే కనిపిస్తోంది. అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయింది. ధోని, రోహిత్ శర్మల సమక్షంలో సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని అందుకోబోతున్న దృశ్యం కోసం కోట్లాది మంది భారతీయులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా సాధించిన అఖండ విజయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అభిమానులే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు - భారత గడ్డపై మరో చరిత్ర!
"అద్భుతం.. అమోఘం! అహ్మదాబాద్‌లో భారత జట్టు సృష్టించిన ఈ విజయం చిరస్మరణీయం. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ఒత్తిడిలోనూ ఆడిన తీరు గర్వకారణం. 140 కోట్ల భారతీయుల తరపున టీమిండియాకు అభినందనలు" అని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు స్పందన - "తెలుగు తేజాల మెరుపులు!"
"విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన తెలుగు రాష్ట్రాల ఆటగాడు తిలక్ వర్మ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడం సంతోషకరం. అహ్మదాబాద్ వేదికగా భారత జెండా రెపరెపలాడటం చూస్తుంటే గర్వంగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
"మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉండటం మనందరికీ గర్వకారణం. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది" అని ఆయన అభినందించారు.

Spotlight

Read More →