తాను ఇంగ్లండ్ వెళ్లిపోయినట్టు వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టిపడేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో 36 ఏళ్ల సర్ఫరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు.
టెస్టు జట్టులో ఆశ్చర్యకరంగా చోటు సంపాదించుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్లలోనూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు.
ఈ ఘోర ప్రదర్శన తర్వాత సర్ఫరాజ్ తన భార్య, పిల్లలను తీసుకుని యూకేకు వెళ్లిపోయినట్టు వార్తలు షికారు చేశాయి.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఈ పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ పాకిస్థాన్ను విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ తన మనసులోకి రాలేదని చెప్పుకొచ్చాడు.
ఆ వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పాడు.
ఇలాంటి పుకార్లు ప్రచారం చేయడానికి ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని హితవు పలికాడు.
ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి