హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూకట్టారు. మూడోరోజు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆ తర్వాత మరో 29 పరుగులు.. మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను చేజార్చుకుని 319.. వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు..
చేయడంతో 126 పరుగుల.. ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అశ్విన్కు చెరో వికెట్ దక్కింది. చివరి ఐదు వికెట్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 153 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా ఒల్లీ పోప్ 39, కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 పరుగులు చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నెల్లూరు జిల్లాలో బర్డ్ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి