ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆదివారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది.
2-0 తేడాతో సిరీస్ను ఖాతాలో వేసుకుంది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే చేధించినప్పటికీ... భారత్కు మ్యాచ్తో పాటు సిరీస్ విజయాన్ని కట్టబెట్టిన ఈ గెలుపు ‘లెగ్ బై’ రన్ రూపంలో వచ్చింది.
క్రీజులో శివమ్ దూబే, రింకూ సింగ్ ఉండడంతో గ్రాండ్గా భారీ సిక్సరో లేదా ఫోరో కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తారనుకుంటే బైస్ రూపంలో వచ్చిన పరుగుతో విక్టరీ దక్కింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫారూఖీ వేసిన బంతి దూబే ప్యాడ్స్కు తగిలి పక్కకు వెళ్లింది. దీంతో క్రీజులో ఉన్న దూబే, రింకూ సింగ్లె లెగ్ బై రన్ తీయడంతో భారత్ విజయాన్ని అందుకుంది.
దీంతో డగౌట్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు నవ్వులు చిందించారు. విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్, అర్షదీప్ సింగ్తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ పడిపడి నవ్వారు.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మైదానంలోని ఫ్యాన్స్ ముఖాల్లో చిన్నపాటి నవ్వు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. కాగా ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా బుధవారం చివరిదైన 3వ టీ20 మ్యాచ్ జరగనుంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి