Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ!

Indiramma Indlu Scheme 2026: రేవంత్ సర్కార్ తీపి కబురు.. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!

Telangana Double Bedroom Houses: తెలంగాణలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, అర్హులైన కారు డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తించేలా నిబంధనలు మారుస్తామని స్పష్టం చేశారు.

Published : 2026-03-19 10:33:00

Telangana Double Bedroom Houses: తెలంగాణలో సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న పట్టణ పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే 18,579 డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. పనులు పూర్తయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, పెండింగ్ బిల్లుల వల్ల ఆగిపోయిన ఈ ఇళ్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేవలం ఇళ్లు కట్టడమే కాకుండా, పేదలు నివసించే ప్రాంతం వారి పని ప్రదేశానికి దగ్గరగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. లబ్ధిదారులు నివసించే చోటు నుంచి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఈ గృహ సముదాయాలను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ అర్హులైన వారికి ఇళ్లు రాకపోతే, నేరుగా వివరాలు అందజేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హులకే ఇళ్లు దక్కేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.

మరోవైపు, ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం రెండో విడతపై కూడా మంత్రి స్పష్టతనిచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ లేదా మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ప్రకటించనుంది. మొదటి విడతలో భాగంగా మార్చి నెలాఖరుకు లక్ష గృహాలు, జూన్-జులై నాటికి సుమారు 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గతంలో సగం పనులు పూర్తయి నిలిచిపోయిన ఇళ్లకు కూడా ఆర్థిక సాయం అందించి పూర్తి చేసేలా వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించబోతున్నారు.

ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికపై వస్తున్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణం పొంది కార్లు నడుపుకునే డ్రైవర్లను 'సొంత వాహనం ఉంది' అనే సాకుతో పథకానికి దూరం పెట్టడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి, జీవనోపాధి కోసం కారు కొనుక్కున్న డ్రైవర్లకు అన్యాయం జరగకుండా నిబంధనల్లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి డ్రైవర్‌కు ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరణించిన 671 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం అందించామని, పిల్లల ఫీజులు, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను తొలగించి, త్వరలోనే జర్నలిస్టులందరికీ తీపి కబురు చెబుతామని స్పష్టం చేశారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, నిజమైన పేదలకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →