AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి!

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్!

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సిద్ధమైంది.అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత డిక్కీ బాబును కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

Published : 2026-02-21 13:26:00

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు భారీ షాక్…

ఎల్ఐసీ నోటీసులతో కదిలిన డొంక..

వైసీపీ నేత డిక్కీ బాబును అరెస్ట్ చేసిన కదిరి పోలీసులు…

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సిద్ధమైంది. బుట్టా కుటుంబం తమ వ్యాపార అవసరాల కోసం ఎల్ఐసీ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి మొత్తం బకాయిలు రూ. 782 కోట్లకు చేరుకున్నాయి. రుణం చెల్లించాలని సంస్థ పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆస్తుల జప్తికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ బకాయిల వసూలు కోసం బుట్టా ఫ్యామిలీ బ్యాంకు వద్ద తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని విలువైన స్థలాలను వేలం వేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో, ఇంత భారీ స్థాయిలో ఆస్తుల వేలం ప్రకటన రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత డిక్కీ బాబును కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. తలుపుల మండల వైసీపీ కన్వీనర్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్న డిక్కీ బాబు, అదృష్టం కలిసి వస్తుందంటూ అమాయకులను నమ్మించి రైస్ పుల్లింగ్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. తాజాగా కడపకు చెందిన ఒక వ్యక్తిని నమ్మించి సుమారు రూ. 30 లక్షలు కాజేయడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

డిక్కీ బాబు మోసాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ వరకు విస్తరించినట్లు ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది. పలువురు ప్రముఖులను కూడా ఈ రైస్ పుల్లింగ్ మాయాజాలంలో చిక్కులు వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ మోసాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Spotlight

Read More →