Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Republic Day 2026: మహిళలే భారత భవిష్యత్తు శక్తి.. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో మహిళా సాధికారత, ఆర్థిక వృద్ధి, భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుందని తెలిపారు

Published : 2026-01-26 08:18:00

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేలా సాగిందని చెప్పుకోవాలి. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బానిసత్వం నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్రంగా భారత్ ఎదిగిన ప్రయాణం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలే భారతదేశానికి బలమైన పునాదులని ఆమె స్పష్టం చేశారు.

గత ఏడాది కాలంలో దేశం సాధించిన విజయాలను ప్రస్తావించిన రాష్ట్రపతి, ముఖ్యంగా మహిళల పాత్రను ప్రముఖంగా కొనియాడారు. “ఇది మహిళల శకం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హర్షధ్వనులు రేపాయి. క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతరిక్ష పరిశోధన, రక్షణ రంగాల్లో భారత మహిళలు సాధిస్తున్న విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. మహిళలు ముందుకు వస్తేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆర్థిక రంగంపై మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశం స్థిరమైన వృద్ధి బాటలో ముందుకెళ్తోందని రాష్ట్రపతి తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాలు దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక స్థంభాలని ఆమె వివరించారు.

మహిళా సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె, దేశంలో ఉన్న జన్ ధన్ ఖాతాల్లో అధిక శాతం మహిళలవేనని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో మహిళలకు లభిస్తున్న ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని చెప్పారు. ఈ మార్పులు మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని, సమాజం మరింత సమతుల్యంగా మారేందుకు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రసంగంలో దేశభక్తి భావనకు కూడా ఆమె పెద్దపీట వేశారు. వందేమాతరం గీత ప్రాముఖ్యతను వివరించిన రాష్ట్రపతి, ఆ గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలకు ప్రేరణగా నిలిచిందని గుర్తుచేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలు, ఆయన ఇచ్చిన “జై హింద్” నినాదం యువతను ఎప్పటికీ స్ఫూర్తితో నింపాలని ఆమె అన్నారు.

అలాగే దేశ సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దులను కాపాడుతున్న సైనికులు, అంతర్గత భద్రతను పరిరక్షిస్తున్న పోలీసులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులు, నర్సుల సేవలను ఆమె ప్రశంసించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు.

చివరగా, స్వావలంబనతో కూడిన అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు ఐక్యతతో పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. సమిష్టి సంకల్పం, పరస్పర సహకారంతోనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Spotlight

Read More →