AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు..

Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!!

Minister Narayana about Amaravati works: రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు.

Published : 2026-03-02 10:26:00

నేలపాడులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ…

పనిచేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోండి…

అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి సీరియస్…

Minister Narayana about Amaravati works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం తన దూకుడును పెంచింది. గత కొంతకాలంగా పనులు నత్తనడకన సాగుతుండటంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి, నేలపాడులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్య వైఖరిపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేలపాడు ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణాల వద్ద కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం, యంత్రాల వినియోగం సరిగ్గా లేకపోవడాన్ని ఆయన గమనించారు. "కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా, పనులు ఎందుకు వేగవంతం కావడం లేదు? అని నిర్మాణ సంస్థల ప్రతినిధులను నిలదీశారు.

పనుల జాప్యంపై సమాధానం చెప్పలేక తడబడిన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువుల ప్రకారం పనులు జరగాలి. పని చేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే ప్రాజెక్టు నుంచి పంపించేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.

కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా, పనుల జాప్యానికి గల కారణాలపై సదరు సంస్థ యాజమాన్యం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సంజాయిషీ ఇచ్చుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తే సహించేది లేదు. వెంటనే మీ సంస్థ యాజమాన్యం సీఎంతో మాట్లాడి, జాప్యంపై వివరణ ఇవ్వాలి అని ఆదేశించారు.

రాజధాని పనుల్లో ఇకపై ఎలాంటి జాప్యం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసి కొత్త సంస్థలకు అప్పగించేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Spotlight

Read More →