Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! LPG Booking: గ్యాస్ బుకింగ్‌పై కేంద్రం కఠిన ఆంక్షలు! 21 రోజుల నుంచి 45 రోజులకు.. Indian Railways: అమృత్ భారత్ పథకంతో రాయనపాడుకు మహర్దశ..! రూ. 20 కోట్లతో అద్భుత రూపాంతరం! AP High Court: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్! AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ! Amaravati Works: అమరావతి రియాలిటీ చెక్... పనులు మందగించాయన్న వార్తల్లో నిజమెంత? AP Farmers: ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రేపే 'అన్నదాత సుఖీభవ' నిధుల విడుదల! Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు బిగ్ రిలీఫ్... కాలేజీ ఫీజు బకాయిలన్నీ ఒకేసారి విడుదల! Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు! Land Regestraion: ఏపీలో ఆ భూములు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.... Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! LPG Booking: గ్యాస్ బుకింగ్‌పై కేంద్రం కఠిన ఆంక్షలు! 21 రోజుల నుంచి 45 రోజులకు.. Indian Railways: అమృత్ భారత్ పథకంతో రాయనపాడుకు మహర్దశ..! రూ. 20 కోట్లతో అద్భుత రూపాంతరం! AP High Court: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్! AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ! Amaravati Works: అమరావతి రియాలిటీ చెక్... పనులు మందగించాయన్న వార్తల్లో నిజమెంత? AP Farmers: ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రేపే 'అన్నదాత సుఖీభవ' నిధుల విడుదల! Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు బిగ్ రిలీఫ్... కాలేజీ ఫీజు బకాయిలన్నీ ఒకేసారి విడుదల! Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు! Land Regestraion: ఏపీలో ఆ భూములు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ....

Chandrababu: ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. చంద్రబాబు ప్రకటన - మున్ముందు విద్యుత్‌ ఛార్జీలు..

Chandrababu Meeting With District Collectors: ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు.

Published : 2026-03-11 14:00:00
  •  కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు..
     
  • రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేకూరనున్న లబ్ది..

Chandrababu Meeting With District Collectors: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దీని ద్వారా సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరుతుందని ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, 2047 నాటికి 'స్వర్ణాంధ్ర' సాకారం చేయడమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నామని కలెక్టర్లకు వివరించారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలు మరియు సంక్షేమ పథకాలు దీర్ఘకాలంలో రాష్ట్ర భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సూపర్ సిక్స్' పథకాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా, అత్యంత పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం 'ట్రూ అప్' పేరుతో ప్రజలపై మోపిన అదనపు భారాలను ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 'ట్రూ డౌన్' విధానం ద్వారా ఉపశమనం కలిగించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించి సామాన్యుడిపై భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు.

Spotlight

Read More →