శ్రీశైల ఆలయం (Srisailam Temple), ఆలయ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకొని ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అటవీ, దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్లు చర్చించి ఒక మాస్టర్న్ రూపొందిస్తారని చెప్పారు. నివేదిక ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలం అలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సున్నిపెంట ప్రాంతాన్ని కూడా నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. అలా చేస్తే ఆదాయం పెరుగుతుంది. తద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ విధనాల కారణంగా రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భరోసా, మాపై పెట్టకున్న నమ్మకంతో ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పైనుంచి బయపడ్డాం. ఈ రోజు కేంద్రంలో మనం అధికారంలో లేకపోయిఉంటే.. వాళ్లు కూడా సహకరించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి మనది.
ఈ పరిస్థితికి ఎవరు కారణం. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, వంశధార వరకు కలపాలి. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. పోలవరానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తున్నాం. ఇది జరిగితే గేమ్ఛేంజర్ అవుతుంది. తొందర్లోనే శుభవార్త చెబుతాను. రాయలసీమ రతనాల సీమ అవుతుంది" అని చంద్రబాబు అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: