ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ను శనివారం అడ్డుకున్నారంటూ ఈ చర్యలు తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారని ఉరవకొండ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు అంగన్వాడీలపై కేసు పెట్టారు.
ఏమి జరిగింది అంటే:
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా పలు చోట్ల వెనక్కి తగ్గకుండా ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లగా.. ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేశారు.
మంత్రి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు జరపడంతో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి