అమరావతి: రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక సైతం ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన కొనసాగుతుందని నారా లోకేష్ అన్నారు. సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ చెల్లెమ్మల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం అన్నారు.
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు 40రోజులుగా ఆందోళనలు చేస్తుంటే సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. పైగా విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడని లోకేష్ ఆరోపించారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందని వ్యాఖ్యానించారు.
ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం అన్నారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని మాట ఇచ్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి